Begin typing your search above and press return to search.

కొడుకు పుట్టినరోజు వేడుకలో మంచు మనోజ్ జోష్

మంచు ఫ్యామిలీలో మనోజ్ మంచు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని క్రియేట్ చేసుకున్నాడు

By:  Tupaki Desk   |   2 Aug 2023 4:12 AM GMT
కొడుకు పుట్టినరోజు వేడుకలో మంచు మనోజ్ జోష్
X

మంచు ఫ్యామిలీలో మనోజ్ మంచు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని క్రియేట్ చేసుకున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఎక్కువగా ప్రయోగాలు చేస్తూ డిఫరెంట్ కంటెంట్ లతో మూవీస్ చేయడం మంచు మనోజ్ కి అలవాటు. అలాగే తన సినిమాలకి యాక్షన్ కొరియోగ్రాఫర్ గా కూడా ఎక్స్ ట్రా టాలెంట్ ని ఈ హీరో చూపిస్తూ ఉంటాడు.

మనోజ్ చివరిగా 2017లో ఒక్కడు మిగిలాడు మూవీతో హీరోగా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. సినిమాని టైగర్ ప్రభాకరన్ కథతో తెరకెక్కించారు. అయితే కంటెంట్ పరంగా బాగున్నా ఎందుకనో ప్రేక్షకులకి రీచ్ కాలేదు. దీంతో కమర్షియల్ ఈ సినిమా డిజాస్టర్ జాబితాలోకి వెళ్ళిపోయింది.

ఇదిలా ఉంటే ఆ మధ్య కాలంలో అహం బ్రహ్మస్మి అనే సినిమాని మంచు మనోజ్ ఎనౌన్స్ చేసాడు. అయితే ఆ చిత్రం ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఐదేళ్ళ తర్వాత రీసెంట్ గా తన కొత్త సినిమా టైటిల్ ని కూడా మనోజ్ ఎనౌన్స్ చేశారు. వాట్ ది ఫిష్ అనే టైటిల్ తో క్రైమ్ కామెడీ కథాంశంతో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు. ఈ చిత్రంతో వరుణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాదిలో భూమా మౌనిక రెడ్డిని మనోజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికే మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. ఆ మూడ్ నుంచి బయటకొచ్చి చాలా రోజుల తర్వాత భూమా మౌనికతో ప్రేమలో పడటం. ఆపై తక్కువ మంది సన్నిహితుల మధ్యలో పెళ్లి చేసుకోవడం జరిగింది. మౌనికకి కూడా ఇది రెండో వివాహం. ఆమెకి ఒక కొడుకు కూడా ఉన్నాడు.

అయితే మౌనిక కొడుకుని ఇప్పుడు మనోజ్ సొంతం కొడుకులా తండ్రి స్థానంలో ఉండి అన్ని చూసుకుంటున్నాడు. తాజాగా కొడుకు ధైరవ్ పుట్టినరోజు వేడుకలని మనోజ్ చాలా గ్రాండ్ గా నిర్వహించాడు. డానికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొడుకుని ఎత్తుకొని మరీ కేక్ కట్ చేయించాడు.

మౌనిక కంటే ఎక్కువ ప్రేమతో దగ్గరుండి ధైరవ్ తో కేక్ కట్ చేయించడమే కాకుండా అతనికి ఇష్టమైన విధంగా మొత్తం డెకరేషన్ చేయించారు. తాజాగా ఒక్క రోజు ముందు కొడుకుతో కలిసి మనోజ్, మౌనిక దంపతులు చంద్రబాబుని కలిసారు. ఈ సందర్భంగా తన కొడుకు ధైరవ్ బర్త్ డే సందర్భంగా ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినట్లు చెప్పారు.