Begin typing your search above and press return to search.

నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి: అల్లు అర్జున్

ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ వేడుకలో వారి మాటలతో ఆకట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   22 Aug 2024 3:44 AM GMT
నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి: అల్లు అర్జున్
X

‘మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ నటుడు రావు రమేశ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను దర్శకుడు లక్ష్మణ్ కార్య రూపొందించగా, ప్రముఖ దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత సమర్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ వేడుకలో వారి మాటలతో ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, “మై డియర్‌ ఫ్యాన్స్‌. నా ఆర్మీ. ఐ లవ్‌ యూ.. నా అభిమానులు అంటే నాకు పిచ్చి. నేను నా ఫ్యాన్స్ ను చూసి హీరో అయ్యాను. గత మూడేళ్లుగా నా సినిమా విడుదల కాలేదు, కానీ నా అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. వారి ప్రేమే నాకు స్ఫూర్తి, నేను ఎప్పుడూ మీకు రుణపడి ఉంటా. ఇక నుంచి ఎక్కువ సినిమాలతో మీ ముందుకు వస్తా” అని తన అభిమానులపై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు.

అల్లు అర్జున్ ప్రత్యేకంగా సుకుమార్ సతీమణి తబిత గురించి మాట్లాడుతూ, “ఆమె పిలవగానే నేను వచ్చాను. ఆమె ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ సినిమాను ప్రెజెంట్ చేయడం గర్వంగా ఉంది. ‘పుష్ప 2’ క్లైమాక్స్ షూట్ మధ్యలో ఉన్నా, ఇప్పటివరకు నేను చేసి అత్యంత కఠినమైన క్లైమాక్స్ ఇది. అప్పుడు తను వచ్చి సుకుమార్, మీరు కాకపోతే నా సినిమా ఈవెంట్ కు ఇంకెవరు వస్తారు అని చెప్పింది. ఇష్టమైన వారికి సపోర్ట్ ఇవ్వడం, వారి పిలుపు వచ్చినప్పుడు వెంటనే స్పందించడం నాకు ఆనందం ఇస్తుంది” అన్నారు.

ఇక పుష్ప 2 సినిమా షూటింగ్ సమయంలో గొడవ జరిగిందని బన్నీ సుకుమార్ అసలు మాట్లాడుకోవడం లేదని చాలా రకాల గాసిప్స్ వచ్చాయి. ఇక వారిద్దరూ ఈవెంట్ లో ఎప్పటి లనే చాలా స్నేహంగా కనిపించడంతో ఫ్యాన్స్ కు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక పుష్ప 2 సినిమా ఆగస్టు రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ పనులు ఆలస్యం కావడంతో డిసెంబర్ 6కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

‘మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం’ చిత్రంలో హీరో రావు రమేశ్‌ కు తోడుగా ఇంద్రజ, అంకిత్, రమ్య పసుపులేటి వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా వినోదంతో పాటు భావోద్వేగాలు కలగలిపిన చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.