Begin typing your search above and press return to search.

మత్తు వదలరా 2 టీజర్.. మరోసారి తస్కరించుట

2019లో విడుదలైన 'మత్తు వదలరా' సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

By:  Tupaki Desk   |   30 Aug 2024 6:03 AM GMT
మత్తు వదలరా 2 టీజర్.. మరోసారి తస్కరించుట
X

2019లో విడుదలైన 'మత్తు వదలరా' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఊహించని విధంగా ఆడియన్స్ నుండి అద్భుతమైన స్పందన అందుకుంది. ఈ చిత్రంలో ట్విస్ట్‌లు, సస్పెన్స్‌-థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయగా, కీరవాణి కొడుకు శ్రీసింహా ఆ సినిమాతో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు.


రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీసింహాతో పాటు సత్య చేసిన కామేడి రోల్ బాగా వర్కౌట్ అయ్యింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోందన్న వార్తలు కొన్ని నెలల కిందటే బయటకు వచ్చాయి. ఫైనల్ గా సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదల కానున్నట్లు సోమవారం ప్రకటించడం జరిగింది. ఈ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఇప్పుడు స్పెషల్ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.

టీజర్ విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన విషయాలను కాంట్రవర్సీలను గట్టిగానే టచ్ చేశారు అనిపిస్తోంది. వెన్నెల కిషోర్ సీరియస్ కామెడీ ప్రెస్ మీట్ తో మొదలైన సీన్స్ చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. H.E టీమ్ అంటూ హీరోతో పాటు సత్య స్పెషల్ ఆఫీసర్లుగా కనిపిస్తున్నారు. మోస్ట్ ఎమెర్జెన్సీ సిచువేషన్స్ ను డీల్ చేసే ఈ ఇద్దరు మళ్ళీ డబ్బుల కోసం ఏ విధంగా అడుగులు వేశరనే పాయింట్ హైలెట్ అవుతోంది. ఇక వీరికి పై ఆఫీసర్ పాత్రలో రోహిణి కనిపిస్తున్నారు.

డెలివరీ భాయ్ గా చేశాను, స్పెషల్ ఏజెంట్ గా చేసినా జీతం సరిపోవడం లేదని హీరో క్యారెక్టర్ ను మళ్ళీ అదే స్టైల్ లో హైలెట్ చేశారు. ఇక హీరోయిన్ ఫారియా కూడా ఏదో యాక్షన్ రోల్ లో కనిపిస్తున్నట్లు అర్ధమవుతుంది. దొంగతనం చేయడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించగా.. సత్య తస్కరించుట డైలాగ్ కూడా హైలెట్ అయ్యింది.

డ్రగ్స్ కావాలా నీకు.. పెద్ద పెద్ద హేమాహేమీలే దొరికిపోయారురా.. అంటూ సత్య చెప్పిన డైలాగ్ కూడా హాట్ టాపిక్ గా నిలిచేలా ఉంది. బాలయ్య వైరల్ వీడియో డైలాగ్ ను కూడా వదల్లేదు. నవ్వోద్దు.. ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్ అంటూ వెన్నెల కిషోర్ కూడా వైరల్ అయ్యేలా ఓ డైలాగ్ వదిలాడు. చూస్తుంటే నేటితరంకు కనెక్ట్ అయ్యేలా సీన్స్ ను గట్టిగానే డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. దానికి తోడు ఛేజింగ్ సీక్వెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

అలాగే సునీల్ కూడా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రతీ పాత్ర కూడా వేరే లెవెల్‌లో డిజైన్ చేసినట్లు అనిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాల భైరవ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా, సురేష్ సారంగం సినిమాటోగ్రాఫర్‌గా, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి, మత్తు వదలరా 2 టీజర్ అయితే బాగానే ఉంది. మరి ఈ సీక్వెల్ ప్రేక్షకుల అంచనాలను అందుకొని, బాక్సాఫీస్ వద్ద మరోసారి విజయాన్ని సాధిస్తుందో లేదో చూడాలి.