Begin typing your search above and press return to search.

మట్కా ఆడియో రైట్స్... ఎవరు సొంతం చేసుకున్నారంటే?

ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ ని ప్రముఖ ఆడియో ప్రొడక్షన్ కంపెనీ టి-సిరీస్ సొంతం చేసుకుంది. మూవీ ఆడియో రైట్స్ కోసం టి-సిరీస్ ఏకంగా 3.6 చెల్లించిందంట.

By:  Tupaki Desk   |   3 Sep 2024 10:45 AM GMT
మట్కా ఆడియో రైట్స్... ఎవరు సొంతం చేసుకున్నారంటే?
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ మట్కా షూటింగ్ స్టేజ్ లో ఉంది. వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని కరుణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. వరుజ్ తేజ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా సిద్ధం అవుతోంది. పీరియాడికల్ జోనర్ లో మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ మూవీ ఉండబోతోంది. కాకినాడలో ప్రస్తుతం కీలక సన్నివేశాల షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ కథాంశం 1952 నుంచి 1982 మధ్యలో టైంలైన్ లో ఉంటుందంట. వరుణ్ తేజ్ క్యారెక్టర్ కూడా మూడు వేరియేషన్స్ లో ఈ చిత్రంలో కనిపించబోతోందని తెలుస్తోంది. ఇది వరకు ఎన్నడూ చేయని చాలెంజింగ్ రోల్ ని వరుణ్ తేజ్ ఈ సినిమాలో చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒక సాధారణ రౌడీ నుంచి మాఫియా డాన్ గా ఎదిగే అతని ప్రయాణం ఈ కథలో ప్రధానంగా ఉంటుందనే ప్రచారం నడుస్తోంది.

ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. అదిరిపోయే ఎలివేషన్స్ తో పాటు పవర్ ఫుల్ సాంగ్స్ ని జీవీ ప్రకాష్ కుమార్ మట్కా మూవీ కోసం కంపోజ్ చేస్తున్నాడంట. ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ ని ప్రముఖ ఆడియో ప్రొడక్షన్ కంపెనీ టి-సిరీస్ సొంతం చేసుకుంది. మూవీ ఆడియో రైట్స్ కోసం టి-సిరీస్ ఏకంగా 3.6 చెల్లించిందంట. ఓ విధంగా వరుణ్ తేజ్ మార్కెట్, ఇమేజ్ తో పోల్చుకుంటే మట్కా ఆడియో రైట్స్ భారీ ధరకి అమ్ముడయ్యాయనే మాట వినిపిస్తోంది.

ఆడియో రైట్స్ గురించి ప్రకటించిన చిత్ర యూనిట్ వరుణ్ తేజ్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అందులో కలవర్ కింగ్ షేప్ లో రమ్మీ కార్డ్ పై చేతిలో సిగార్ పట్టుకొని మాఫియా డాన్ లుక్ లో వరుణ్ తేజ్ స్టైలిష్ గా కూర్చొని ఉన్నాడు. అతని ముందు డబ్బుల కట్టలు టేబుల్ పై పడి ఉన్నాయి. ఈ లుక్ చూస్తుంటే మట్కా మూవీతో వరుణ్ తేజ్ ఇమేజ్ మారిపోవడం గ్యారెంటీ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మాఫియా డాన్ లుక్ లో వరుణ్ తేజ్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నదని ఫ్యాన్స్ అంటున్నారు. వరుణ్ తేజ్ కి అదిరిపోయే ఎలివేషన్ ఉంటుందని మెగా భావిస్తున్నారు.

దర్శకుడు కరుణ్ కుమార్ కూడా గ్యాప్ తీసుకొని మట్కా సినిమాని పెర్ఫెక్ట్ గా రెడీ చేసుకొని సెట్స్ పైకి తీసుకొని వెళ్లారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో పీరియాడిక్ నేటివిటీకి కనెక్ట్ అయ్యే విధంగా భారీ సెట్ ని నిర్మించారంట. ఇందులో మెజారిటీ సీక్వెన్స్ ని తెరకెక్కించనున్నారంట. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి కనిపిస్తున్నారు. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, రవి శంకర్ కూడా సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.