Begin typing your search above and press return to search.

మెగా, అల్లు వారి చిత్రాలు.. విన్నర్ ఎవరో?

మెగా, అల్లు కుటుంబాల ఫ్యాన్స్ మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Oct 2024 2:30 PM GMT
మెగా, అల్లు వారి చిత్రాలు.. విన్నర్ ఎవరో?
X

మెగా, అల్లు కుటుంబాల ఫ్యాన్స్ మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన ఆ వార్.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీనిపై అటు మెగా కుటుంబసభ్యులు గానీ.. ఇటు అల్లు ఫ్యామిలీ మెంబర్స్ గానీ స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో స్టార్ట్ అయిన ఫ్యాన్స్ వార్.. గ్రౌండ్ లెవల్ కు కూడా పాకిందని తెలుస్తోంది. దీంతో రెండు కుటుంబాల నుంచి వస్తున్న అప్ కమింగ్ మూవీస్ విషయంలో ఏం జరుగుతుందోనన్న డిస్కషన్ స్టార్ట్ అయింది.

అయితే అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ రిలీజ్ అవుతుండగా.. మెగా కుటుంబం నుంచి గేమ్ ఛేంజర్, హరిహర వీరమల్లు, విశ్వంభర చిత్రాలు రానున్నాయి. పుష్ప సీక్వెల్.. డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ గా.. మిగతా మూడు సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ముందుగా పుష్ప-2కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవల్ లో మంచి రెస్పాన్స్ అందుకుని పుష్ప.. రూ.250 కోట్లు ఓపెనింగ్స్ సాధిస్తుందని అంతా అంచనా వేస్తున్నారు.

రిలీజ్ అయ్యాక మౌత్ టాక్ పాజిటివ్ గా వస్తే.. బాక్సాఫీస్ వద్ద పుష్ప-2 రూ.1000 కోట్లు సాధించడం పక్కా అనే చెప్పాలి. మరోవైపు, మెగా ఫ్యామిలీ నుంచి ముందుగా రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జనవరి 10వ తేదీన రిలీజ్ కానున్న ఆ మూవీపై ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ అనుకున్నంత స్థాయిలో సినీ ప్రియుల్లో బజ్ క్రియేట్ చేయలేదని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ 2025 మార్చి 28వ తేదీ రిలీజ్ కానుంది. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఆ ప్రాజెక్టును ఇప్పుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ రీసెంట్ గా తప్పుకున్నారు. స్టార్టింగ్ లో మంచి అంచనాలు నెలకొల్పిన ఆ మూవీ.. అలా లేట్ అవ్వడంతో హోప్స్ కాస్త తగ్గాయనే చెప్పాలి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. విశ్వంభరతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సోషియో ఫాంటసీ జోనర్ లో వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు.

అంజి తర్వాత మరోసారి చిరు ఆ జోనర్ లో మూవీ చేస్తుండడంతో మంచి అంచనాలే ఉన్నాయి. కానీ రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ నిరాశపరిచింది. వీఎఫ్ ఎక్స్ క్వాలిటీ బాగోలేకపోవడంతో అనేక మంది పెదవి విరిచారు. దీంతో మేకర్స్ ఇప్పుడు రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. మొత్తానికి మెగా, అల్లు కుటుంబాల నుంచి వచ్చే చిత్రాల్లో పుష్ప -2 డామినేట్ చేసేలా కనిపిస్తుంది. కానీ రిలీజ్ అయ్యాక ఏ మూవీ ఎలా ఉంటుందో చెప్పలేం. కాబట్టి ఎదురు చూడాల్సిందే.