Begin typing your search above and press return to search.

మెగా హీరోల మధ్య దూరం.. ఇది మరో ఉదాహరణ?

రాజకీయాల పరంగా ప్రతి ఒక్కరికి వ్యక్తిగత అభిమానాలు, ఇష్టాలు ఉంటాయి.

By:  Tupaki Desk   |   27 Aug 2024 6:40 AM GMT
మెగా హీరోల మధ్య దూరం.. ఇది మరో ఉదాహరణ?
X

రాజకీయాల పరంగా ప్రతి ఒక్కరికి వ్యక్తిగత అభిమానాలు, ఇష్టాలు ఉంటాయి. ఇక ఈ క్రమంలో కొంత గ్యాప్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పెరిగిన దూరాన్ని తగ్గించే వారికంటే మరింత పెంచే వారే సమాజంలో ఎక్కువగా ఉంటారు. అసలు ఈ సంగతి అంతా ఇప్పుడు ఎందుకంటే మెగా, అల్లు కుటుంబాలను ఫ్యాన్స్ ఎప్పుడు వేరుగా చూడలేదు.

పండుగలు, ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అన్ని కూడా అందరూ కలిసి చేసుకునేవారు. అయితే ఈ రెండు కుటుంబాల మధ్యలోకి రాజకీయాలు చేరాయి. 2024 ఎన్నికల సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన స్నేహితుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తరుపున ఎన్నికల ప్రచారం చేశారు. అయితే మెగా ఫ్యామిలీ హీరోలైన రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ అందరూ పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురంలో ప్రచారం చేశారు.

చరణ్ పిఠాపురంలో ప్రచారంలో పాల్గొన్న చివరి రోజు అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్థి తరపున ఎన్నికల కాంపెయిన్ చేశారు. ఇది మెగా ఫ్యాన్స్ కి, జన సైనికులకు అస్సలు మింగుడుపడలేదు. ఎన్నికల కౌంటింగ్ తర్వాత నాగబాబు ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. రెండు రోజులకి ట్వీట్ డిలీట్ చేసిన అది అల్లు అర్జున్ గురించే అనే ప్రచారం తెరపైకి వచ్చింది. అప్పటి నుంచి ఈ అల్లు వెర్సస్ మెగా వివాదం ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో నడుస్తోంది.

పవన్ కొన్ని కొన్ని రోజుల క్రితం బెంగుళూరులో అధికారులతో మాట్లాడుతూ ఒకప్పుడు అడవిని రక్షించేవారిని హీరోలుగా సినిమాలలో చూపించేవారు. ఇప్పుడు చెట్లు నరికే స్మగ్లర్స్ ని హీరోలుగా చిత్రీకరిస్తున్నారు అని కామెంట్స్ చేశారు. ఇది పుష్పలో అల్లు అర్జున్ క్యారెక్టర్ ని ఉద్దేశించి చేసినవే అనే విమర్శలు వచ్చాయి. ఈ వివాదం నడుస్తూనే ఉంది. అయితే ఇది కేవలం ఫ్యాన్ వార్ కాదని, రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో పుష్ప ది రూల్ షూటింగ్ తో పాటు వరుణ్ తేజ్ మట్కా, సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాలు షూట్స్ కూడా జరుగుతున్నాయంట. ఈ ముగ్గురి సినిమాల షూటింగ్స్ పక్క పక్కనే జరుగుతున్న కూడా వరుణ్ తేజ్, సాయి తేజ్ అల్లు అర్జున్ ని కలవలేదంట. అలాగే బన్నీ కూడా వరుణ్, తేజ్ లలో ఎవరిని కలిసే ప్రయత్నం చేయలేదంట.

సాయు, వరుణ్ కలుసుకున్నా కూడా వారు ఇద్దరు బన్నీని కలవకపోవడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది.

ఒకరికి ఒకరు సంబంధం లేనట్లు షూటింగ్స్ చేసుకుంటున్నారని టాక్ అయితే వైరల్ అవుతోంది. ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. అందరూ గొప్పగా చెప్పుకునే మెగా కాంపౌండ్ లో రాజకీయం చిచ్చు పెట్టిందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. మరి ఈ వివాదానికి ఎప్పుడు ముగింపు కార్డు పడుతుందో చూడాలి.