Begin typing your search above and press return to search.

ఇంట్రస్టింగ్‌... అమ్మవార్ల మధ్య పోటీ!

టాలీవుడ్‌ తో పోల్చితే కోలీవుడ్‌ లో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు ఆదరణ ఎక్కువ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

By:  Tupaki Desk   |   15 July 2024 10:30 AM GMT
ఇంట్రస్టింగ్‌... అమ్మవార్ల మధ్య పోటీ!
X

టాలీవుడ్‌ తో పోల్చితే కోలీవుడ్‌ లో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు ఆదరణ ఎక్కువ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే అక్కడ ప్రతి ఏడాది పదుల సంఖ్యలో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు రూపొందుతున్నాయి. అందులో మంచి విజయాలను సొంతం చేసుకుంటున్న సినిమాలు కూడా ఉన్నాయి.

తమిళ లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు అనగానే చాలా మందికి నయనతార, త్రిష, హన్సిక ల పేర్లు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు నయనతార మరియు త్రిషల మధ్య ఒక ఇంట్రస్టింగ్‌ ఫైట్‌ కి తెర లేవబోతుంది. రెండు సినిమాలు నువ్వా నేనా అంటూ ఈ ఇద్దరి స్టార్‌ డమ్‌ కి పరీక్ష పెట్టబోతున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాలుగు ఏళ్ల క్రితం నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన మూకుతి అమ్మన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తెలుగు లో అమ్మోరు తల్లి అంటూ వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సమయంలో కొన్ని కారణాల వల్ల డైరెక్ట్‌ ఓటీటీ లో మూకుతి అమ్మన్ స్ట్రీమింగ్‌ అయ్యింది.

ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సీక్వెల్‌ చేయాలని నిర్మాణ సంస్థ భావించింది. నయనతార ఇతర కమిట్‌మెంట్స్‌ ఇంకా పలు కారణాల వల్ల మూకుతి అమ్మన్‌ సీక్వెల్‌ కు ఇన్నాళ్ల సమయం పట్టింది. ఎట్టకేలకు సీక్వెల్‌ ను ప్రకటించారు.. కానీ దర్శకుడు మాత్రం మారాడు.

మూకుతి అమ్మన్‌ ను రూపొందించిన దర్శకుడు ఆర్జే బాలాజీ కొత్తగా మాసాని అమ్మన్ అనే సినిమాను త్రిష ప్రధాన పాత్రలో రూపొందించేందుకు ఏర్పాట్లు షురూ చేశాడు. మూకుతి అమ్మన్‌ 2 మరియు మాసాని అమ్మన్‌ సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మూకుతి అమ్మన్ సీక్వెల్‌ ను కాదని మరో అమ్మన్ మూవీని చేసేందుకు సిద్దం అయిన దర్శకుడు బాలాజీ కచ్చితంగా త్రిష తో సూపర్‌ హిట్‌ మూవీ తీస్తాడనే నమ్మకం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు సీనియర్ స్టార్‌ హీరోయిన్స్ అమ్మవార్లుగా నటిస్తే కచ్చితంగా టాప్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అవ్వడం ఖాయం.