Begin typing your search above and press return to search.

కొత్త జంట‌కు 640 కోట్ల విల్లా కానుకిచ్చిన అంబానీ

కొడుకు కోడ‌లుకి ఇంత అద్భుత‌మైన కానుక ఇచ్చిన మ‌రొక ధ‌నికుడు లేడంటూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

By:  Tupaki Desk   |   9 July 2024 12:30 AM GMT
కొత్త జంట‌కు 640 కోట్ల విల్లా కానుకిచ్చిన అంబానీ
X

రాజు గారు త‌లుచుకుంటే దెబ్బ‌ల‌కు కొదవా? డ‌బ్బుల‌కు కొద‌వా? త‌మ సంప‌ద‌ల‌కు త‌గ్గ‌ట్టే రాజుగారి త‌న‌యుడికి అరుదైన ఖ‌రీదైన కానుక అందింది. ఇది ప్ర‌పంచంలోని పెళ్లి కానుక‌ల్లోనే అత్యంత ఖ‌రీదైన కానుక‌. ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ధ‌న‌వంతుడు ఇలాంటి కానుక‌ను త‌న కొడుకు కోడలుకి ఇచ్చి ఉండ‌డు. అంబానీలు ఆడంబ‌రాల్లోనే కాదు.. త‌మ వార‌స‌త్వానికి ప్రేమ‌ను అందించ‌డంలోను శిఖ‌రం ఎత్తు అని మ‌రోసారి నిరూప‌ణ అయింది. తాజాగా ముఖేష్ అంబానీ త‌న‌యుడికి ఇచ్చిన పెళ్లి కానుక విలువ రూ.640 కోట్లు. కొడుకు కోడ‌లుకి ఇంత అద్భుత‌మైన కానుక ఇచ్చిన మ‌రొక ధ‌నికుడు లేడంటూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళితే..

అంబానీ కుటుంబం ఖ‌రీదైన ఆకాశ‌హార్మ్యంలో నివ‌శించ‌డ‌మే కాదు.. స‌క‌ల సౌక‌ర్యాలు నిండిన అధునాత‌న‌ కార్లను వినియోగించ‌డంలోనే కాదు.. డిజైనర్ దుస్తులు, ఆభ‌ర‌ణాలు ధ‌రించ‌డంలోను ఎప్పుడూ ఏ విష‌యంలోను త‌గ్గ‌రు. ఇది వారి రాజ‌సానికి సింబాలిక్.. విలాసవంతమైన జీవనశైలికి వారు పెట్టింది పేరు అందుకే. ముఖేష్- నీతా అంబానీ తమ కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ జంట‌కు దుబాయ్‌లో ఒక విల్లాను బహుమతిగా ఇచ్చారని వార్తలు రావ‌డం ఎవ‌రికీ ఆశ్చ‌ర్యం క‌లిగించ‌లేదు. కేవలం ఆసక్తిని మాత్ర‌మే రేకెత్తించింది!

అనంత్ - రాధికలకు దుబాయ్‌లోని పామ్ జుమేరాలో అత్యంత ఖ‌రీదైన‌, విలాసవంతమైన విల్లాను కానుక‌గా ఇచ్చారు. ఈ బీచ్ ఫ్రంట్ ప్రాపర్టీకి దాదాపు రూ. 640 కోట్లు ఖర్చయిందని అంచనా. ఇది దాదాపు 76 మిలియన్ డాల‌ర్లు. సుమారు 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విల్లా దుబాయ్‌లోని అత్యంత ఖరీదైన ప్రాపర్టీలలో ఒకటిగా పేరుగాంచింది. విల్లా స్పెసిఫికేషన్స్ ఏమిటి? అంటే.. ఈ భవనంలో 10 విశాలమైన బెడ్‌రూమ్‌లు, 70 మీటర్ల ప్రైవేట్ బీచ్, సంపన్నమైన ఇంటీరియర్స్ ఉన్నాయి. ఈ ఇంటిని అద్భుత‌మైన‌ కళాకృతుల‌తో డిజైన్ చేసారు. ఇటాలియన్ పాలరాయి, డిజైన‌ర్ షీల్డ్స్ తో అలంకరించిన ఇల్లు ఇది. ఇందులో ఒక‌ ప్రైవేట్ పూల్ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది.

అనంత్ అంబానీ ప్రీవెడ్డింగుల కోసం ఇప్ప‌టికే 1500 కోట్లు ఖ‌ర్చు చేసిన అంబానీలు మ‌రో 500 కోట్ల రూపాయ‌ల‌ను పెళ్లి వేడుక కోసం ఖ‌ర్చు చేస్తున్నార‌ని అంచ‌నా. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న టాప్ సెల‌బ్రిటీలంతా అంబానీల ప్రీవెడ్డింగుల్లో పాల్గొన్నారు. ఇప్పుడు పెళ్లి వేడుక‌లోను భారీగా సెల‌బ్రిటీలు పాల్గొంటున్నారు. సంగీత్ వేడుక‌తో ఇప్ప‌టికే కోలాహాలం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. జూలై 12న అనంత్ అంబానీ- రాధికా మ‌ర్చంట్ ల వివాహం జ‌ర‌గ‌నుంది.