Begin typing your search above and press return to search.

మైత్రీ దూకుడు వేరే లెవల్.. ఒకేసారి 3 సినిమాలతో!

సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు మూవీతో నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Sep 2024 7:44 AM GMT
మైత్రీ దూకుడు వేరే లెవల్.. ఒకేసారి 3 సినిమాలతో!
X

సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు మూవీతో నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫస్ట్ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న ఆ సంస్థ.. ఇప్పుడు టాప్ ప్రొడక్షన్ హౌస్ గా మారింది. స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంది. ఇప్పుడు భారీ బడ్జెట్ తో మరిన్ని సినిమాలు చేస్తోంది. త్వరలోనే అనేక చిత్రాలను విడుదల చేయనుంది.

ఓ వైపు భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తూ.. మరోవైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. లైనప్ లో బోలెడు సినిమాలను ఉంచింది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2, ప్రభాస్- హను రాఘవపూడి మూవీ సహా ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు రూపొందిస్తోంది. ఇప్పటికే కొన్ని సెట్స్ పై ఉండగా.. మరికొన్ని ప్రాజెక్టుల షూటింగ్ లు త్వరలోనే స్టార్ట్ కానున్నాయి. మధ్యలో కొన్ని ఫ్లాపులు వస్తున్నా.. వరుసగా హిట్లు అందుకుంటోంది మైత్రీ సంస్థ.

అయితే నిర్మాణం విషయంలో ఫుల్ జోష్ పై ఉన్న మైత్రీ మూవీ మేకర్స్.. డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా ఇప్పుడు తన సత్తా చాటుతోంది. నైజాం ఏరియాకు గాను అనేక చిత్రాల థియేట్రికల్ హక్కులను దక్కించుకుంటోంది. ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ చిత్రాల రైట్స్ ను అందుకుంది. సినిమా రిజల్ట్స్ పక్కన పెడితే.. వరుస మూవీలను థియేటర్లలో విడుదల చేస్తోంది.

గత వారం దళపతి విజయ్ ది గోట్ మూవీ రిలీజ్ చేసిన మైత్రీ సంస్థ.. ఈ వారం మరో మూడు చిత్రాలను విడుదల చేయనుంది. సెప్టెంబర్ 13వ తేదీన బ్లాక్ బస్టర్ హిట్ మత్తు వదలరా సీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొల్పిన మత్తు వదలరా-2ను రిలీజ్ చేయనుంది. దిలీప్ ప్రకాష్, రెజీనా నటించిన ఉత్సవం మూవీని కూడా తీసుకు రానుంది. ఆ సినిమాలో బ్రహ్మానందం, నాజర్, ప్రకాష్ రాజ్ వంటి అనేక మంది భాగమయ్యారు.

అదే సమయంలో మాలీవుడ్ స్టార్ హీరో టోవినో థామస్ లేటెస్ట్ మూవీ ఏఆర్ ఎం మూవీని కూడా మైత్రీ సంస్థ విడుదల చేయనుంది. ఫాంటసీ జోనర్ లో తెరకెక్కుతున్న ఆ సినిమా ట్రైలర్.. మంచి విజువల్స్ కంటెంట్ తో ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. అయితే 2018 మూవీతో టోవినో థామస్ తెలుగులో స్పెషల్ ఫ్యాన్ బేస్ దక్కించుకున్నారు. మరి మూడు సినిమాలతో వస్తున్న మైత్రీ.. ఎలాంటి హిట్లు అందుకుంటుందో వేచి చూడాలి.