Begin typing your search above and press return to search.

మైత్రి దర్శక బలం.. పవర్ఫుల్ పిక్

అయితే అందులో యువ దర్శకులు సీనియర్ దర్శకులు స్టార్ దర్శకులు సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోను దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   21 Nov 2023 1:49 PM GMT
మైత్రి దర్శక బలం.. పవర్ఫుల్ పిక్
X

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకులకు ఉన్నంత డిమాండ్ ఎవరికి లేదు అని చెప్పాలి. ఎందుకంటే మంచి సినిమాలు చేస్తూ సక్సెస్ ట్రాక్ ను కొనసాగించడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఇక అలాంటి దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నా ఇండస్ట్రీలో నిర్మాతల నుంచి ఆఫర్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి వాళ్లు ఒక కాంపౌండ్ లో కుదురుగా ఉండకపోవచ్చు.

కానీ మైత్రి మూవీ మేకర్స్ మాత్రం ఇండస్ట్రీలో ఉన్న సక్సెస్ఫుల్ దర్శకులందరిని కూడా తన వైపుకు తిప్పుకుంటోంది అని చెప్పాలి. ప్రస్తుతం ఈ కాంపౌండ్ లో పదిమందికి పైగా టాలెంటెడ్ దర్శకులు సినిమాలు చేస్తున్నారు. మరి కొంతమంది భవిష్యత్తులో కూడా ప్రాజెక్టులను స్టార్ట్ చేయబోతున్నారు.

ఇక రీసెంట్ గా మైత్రి నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని పుట్టినరోజు సందర్భంగా కొంతమంది సినీ ప్రముఖులకు పార్టీ ఇచ్చారు. అయితే అందులో యువ దర్శకులు సీనియర్ దర్శకులు స్టార్ దర్శకులు సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోను దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

ఇక ఫోటోలో అయితే సుకుమార్ తో పాటు గోపీచంద్ మలినేని బుచ్చిబాబు, హను రాగవపూడి, హరీష్ శంకర్, వెంకీ కుడుముల రాహుల్ సంకీర్తన కనిపించారు. వీరందరూ కూడా ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ లోనే సినిమాలు చేస్తూ ఉన్నారు. మరికొందరు త్వరలో కొత్త ప్రాజెక్టులకు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ ను మొదట ఇండస్ట్రీకి పరిచయం చేసింది మాత్రం కొరటాల శివనే.

ఆయన దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమాతోనే ఈ సంస్థ భారీ విజయాన్ని అందుకొని ఆ తర్వాత ఎంతో విజయవంతంగా సినిమాలను నిర్మిస్తోంది. కేవలం సక్సెస్ ట్రాక్లో ఉన్న దర్శకులను మాత్రమే కాకుండా కొత్తవారికి కూడా అవకాశాలు కల్పిస్తున్న ఈ నిర్మాణ సంస్థ కోసం ఎక్కువగా కాంబినేషన్స్ కు నమ్ముకుంటోంది. ఇక ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఆ సినిమా కోసం 350 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నారట. అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ కోసం అంతకుమించి అనేలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాడు. ఇక ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది.