Begin typing your search above and press return to search.

కంటెంట్ ఉన్న మరో మూవీని కొనేసిన మైత్రి

తెలుగు భాషలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలను నిర్మించేందుకు సిద్ధమైంది.

By:  Tupaki Desk   |   23 Aug 2024 6:38 AM GMT
కంటెంట్ ఉన్న మరో మూవీని కొనేసిన మైత్రి
X

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. వై రవి శంకర్, నవీన్ యెర్నేని నేతృత్వంలోని ఈ సంస్థ వరుసగా పలు పెద్ద సినిమాలను నిర్మిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ తక్కువ కాలంలోనే భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. తెలుగు భాషలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలను నిర్మించేందుకు సిద్ధమైంది.

అలాగే మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ఈ సంస్థ ముందుకుసాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ కేవలం ప్రొడక్షన్ లోనే కాదు, డిస్ట్రిబ్యూషన్ లో కూడా ప్రవేశించి మంచి సక్సెస్ లను అందుకుంటోంది. తాజాగా మలయాళం చిత్రం ARM తెలుగు హక్కులను సొంతం చేసుకోవడం ద్వారా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను తెలుగు ప్రేక్షకులకు అందించనుంది.

టొవినో థామస్, కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, బసిల్ జోసెఫ్, సురభి లక్ష్మి వంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ARM సినిమాకు జితిన్ లాల్ దర్శకత్వం వహించగా, మ్యూజిక్ అందిస్తున్నది దిబు నినన్ థామస్. ఈ సినిమా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మలయాళంలో మంచి పేరుతెచ్చుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ గా విడుదల చేయాలని చూస్తున్నారు.

తప్పకుండా ఈ సినిమా తెలుగు ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతుందని మైత్రి వారు బలంగా నమ్ముతున్నారు. ఇక త్వరలో రాబోతున్న మరికొన్ని తమిళ బిగ్ సినిమాలను కూడా వీరు తెలుగులో థియేట్రికల్ గా రిలీజ్ చేయనున్నారు. మరోవైపు ప్రొడక్షన్ పరంగా భారీ సినిమాలను లైన్ లో పెట్టారు. రీసెంట్ గా ప్రభాస్ హను కాంబినేషన్ ను కూడా సెట్స్ పైకి తీసుకు వచ్చారు.

ఇక మైత్రిలోనే అల్లు అర్జున్ చేస్తున్న 'పుష్ప-2: రూల్' సుకుమార్ దర్శకత్వంలో ఈ ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ 17వ సినిమాగా రూపొందుతున్న 'RC17' చిత్రాన్ని కూడా సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, ఈ సినిమా 2026లో విడుదల కావచ్చు. అలాగే, జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ ను ఇటీవల లాంచ్ చేశారు. ఈ సినిమాను 2026లో ప్రేక్షకులకు అందించాలనేది మైత్రి వారి ప్లాన్.

పవన్ కళ్యాణ్ తో చేస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది, అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. ఈ చిత్రం 2025లో విడుదల అయ్యే అవకాశం ఉంది. అలాగే తమిళ స్టార్ అజిత్ కుమార్ తో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాను 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇవే కాకుండా, బాలీవుడ్‌లో సన్నీ డియోల్, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో ఒక సినిమా రెడీ అవుతోంది. వీటితో పాటు నితిన్ హీరోగా నటిస్తున్న 'రాబిన్ హుడ్' ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. అలాగే '8 వసంతాలు' అనే చిన్న సినిమాను కూడా మైత్రి వారు నిర్మిస్తున్నారు