Begin typing your search above and press return to search.

మైత్రీ '8 వసంతాలు'.. కొత్త అప్డేట్ ఏంటంటే?

డెబ్యూ ఫిల్మ్ మనుతో వరల్డ్ వైడ్ గా ప్రశంసలు అందుకున్న ఫణీంద్ర డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో 8 వసంతాలుపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

By:  Tupaki Desk   |   19 Aug 2024 5:04 PM GMT
మైత్రీ 8 వసంతాలు.. కొత్త అప్డేట్ ఏంటంటే?
X

టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫుల్ జోష్ మీద ఉన్న విషయం తెలిసిందే. అటు భారీ బడ్జెట్ చిత్రాలతోపాటు ఇటు కంటెంట్ బేస్ట్ మూవీస్ ను నిర్మిస్తోంది. వరుస హిట్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ఒక్క తెలుగులోనే కాకుండా.. మిగతా భాషల్లో కూడా సత్తా చాటేందుకు సిద్ధమైంది. మాలీవుడ్ లోకి ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన మైత్రీ సంస్థ.. కోలీవుడ్, బాలీవుడ్ లోకి త్వరలోనే గ్రాండ్ గా అడుగుపెట్టనుంది.

వై రవి శంకర్, నవీన్ యెర్నేని యాజమాన్యంలోని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న అనేక సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. అల్లు అర్జున్ పుష్ప-2, పవన్ కళ్యాణ్ ఉస్తాద్, నితిన్ రాబిన్ హుడ్ సహ పలు సినిమాలను త్వరలో విడుదల చేయనుంది. మరిన్ని భారీ చిత్రాల షూటింగ్ ను కొన్ని రోజుల్లో మొదలుపెట్టనుంది. అయితే వీటితోపాటు 8 వసంతాలను మూవీని కూడా నిర్మిస్తోంది మైత్రీ సంస్థ. ఈ కాన్సెప్ట్ బేస్ట్ మూవీకి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.

డెబ్యూ ఫిల్మ్ మనుతో వరల్డ్ వైడ్ గా ప్రశంసలు అందుకున్న ఫణీంద్ర డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో 8 వసంతాలుపై మంచి అంచనాలు నెలకొన్నాయి. సూపర్ హిట్ మూవీ మ్యాడ్ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్.. లీడ్ రోల్ లో నటిస్తోంది. ఇప్పటికే మేకర్స్.. రిలీజ్ చేసిన అనంతిక ఫస్ట్ లుక్ అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. మూవీపై ఆసక్తి పెంచింది. సినిమాలో ఆమె రోల్ నేమ్ శుద్ధి అయోధ్యగా మేకర్స్ రివీల్ చేసిన విషయం తెలిసిందే.

అయితే మేకర్స్ త్వరలోనే అనంతిక రోల్ కు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఊటీ, హైదరాబాద్, కన్యాకుమారి వంటి పలు ప్రదేశాల్లో షూటింగ్ షెడ్యూళ్లను ఇప్పటికే మేకర్స్ పూర్తి చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ కోసం కాశ్మీర్, ఆగ్రా, కాశీ ప్రాంతాలకు మూవీ టీమ్ వెళ్లనుంది. ఆ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తవ్వనుంది.

ఓవైపు షూటింగ్.. మరో ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు మేకర్స్. సినిమాలో అనంతికతో పాటు హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బా ప్రగడ, సమీర కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తున్నారు. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, ఎడిటర్ గా శశాంక్ మాలి వ్యవహరిస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.