Begin typing your search above and press return to search.

మైత్రి చేతుల్లోకి ఇంట్రస్టింగ్ పొలిటికల్‌ డ్రామా

ఇటీవల వరుసగా పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేస్తూ వచ్చిన మైత్రి తాజాగా యాత్ర 2 సినిమాను పంపిణీ చేసేందుకు హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   20 Jan 2024 5:12 AM GMT
మైత్రి చేతుల్లోకి ఇంట్రస్టింగ్ పొలిటికల్‌ డ్రామా
X

ఇటీవల సినిమాల డిస్ట్రిబ్యూషన్ లో మైత్రి వారు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల వరుసగా పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేస్తూ వచ్చిన మైత్రి తాజాగా యాత్ర 2 సినిమాను పంపిణీ చేసేందుకు హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని యాత్ర 2 నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు.

నైజాం మరియు సీడెడ్‌ లో ఈ సినిమాను మైత్రి శశి పంపిణీ చేసేందుకు భారీ మొత్తానికి కొనుగోలు చేశాడని సమాచారం అందుతోంది. యాత్ర మొదటి భాగం 2019 ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు యాత్ర 2 ను కూడా ఫిబ్రవరి 8న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎదుర్కొన్న రాజకీయ ఒతిడి మరియు ఆయన పాదయాత్ర, తదుపరి రాజకీయ పరిణామాల ఆధారంగా సినిమాని రూపొందించినట్లు ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది.

మహి వి రాఘవ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రను మరోసారి మమ్ముట్టి పోషించగా జీవా వైఎస్‌ జగన్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. యాత్ర మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో యాత్ర 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ పొలిటికల్ డ్రామా ను మైత్రి వారు పంపిణీ చేయబోతున్న నేపథ్యంలో కూడా పాజిటివ్ బజ్‌ క్రియేట్‌ అయ్యింది.