Begin typing your search above and press return to search.

నాగచైతన్య పవర్ఫుల్ లైనప్.. ఆ ఒక్కటీ నిజం కాదు

ఇక వీటితోపాటు నాగ చైతన్య మరొక వెబ్ సిరీస్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల కొన్ని కథనాలు వెలుపడ్డాయి. అయితే అందులో నిజం లేదని నాగచైతన్య టీమ్ నుంచి అఫీషియల్ గా క్లారిటీ వచ్చేసింది.

By:  Tupaki Desk   |   14 Oct 2024 3:49 PM GMT
నాగచైతన్య పవర్ఫుల్ లైనప్.. ఆ ఒక్కటీ నిజం కాదు
X

టాలెంటెడ్ యువర్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా నెవర్ బిఫోర్ అనేలా ఒక కొత్త కథనంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటివరకు నాగచైతన్య చేసిన సినిమాలు ఒక లెక్క ఇప్పుడు రాబోయే తండేల్ సినిమా మరొక లెక్క అనే విధంగా ఒక ట్రెండ్ సెట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

అయితే నాగచైతన్య ఈ సినిమా తరువాత ఎవరితో వర్క్ చేస్తారు అనే విషయంలో కూడా అనేక రకాల రూమర్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ఇక నాగచైతన్య మాత్రం పర్ఫెక్ట్ లైన్ అప్ తోనే తన కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రతి కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాడు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న తండేల్ సినిమా మత్స్యకారుల నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

అలాగే ఇండియా పాకిస్తాన్ కు సంబంధించిన ఒక రియల్ సంఘటనను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇక ఆ తరువాత సితార ఎంటర్టైన్మెంట్స్ లోనే నాగచైతన్య ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమాకు బాబి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇదివరకే బాబీ దర్శకత్వంలో నాగచైతన్య 'వెంకీ మామ' అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. మరోవైపు తనకు మంచి సక్సెస్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేసేందుకు ఓకే చెప్పేసాడు.

ఆ సినిమా మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్లో తెరపైకి రాబోతోంది. ఇక వీటితోపాటు నాగ చైతన్య మరొక వెబ్ సిరీస్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల కొన్ని కథనాలు వెలుపడ్డాయి. అయితే అందులో నిజం లేదని నాగచైతన్య టీమ్ నుంచి అఫీషియల్ గా క్లారిటీ వచ్చేసింది. గతంలో దూత అనే వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న నాగచైతన్యకు ఇండస్ట్రీలో ఆఫర్లు పెరిగాయి.

కానీ చైతన్య మాత్రం మంచి కంటెంట్ ఉన్న కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు. వెబ్ సిరీస్ చేస్తున్నాడు అనే వార్తల్లో మాత్రం నిజం లేదు అని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక తండేల్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలోనే విడుదల కాబోతోంది. సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.