Begin typing your search above and press return to search.

జానీ మాస్టర్ వివాదం.. నాగబాబు ట్వీట్స్.. ఇప్పుడే ఎందుకు?

దీంతో అవి ఫుల్ వైరల్ గా మారాయి. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.

By:  Tupaki Desk   |   19 Sep 2024 9:14 AM GMT
జానీ మాస్టర్ వివాదం.. నాగబాబు ట్వీట్స్.. ఇప్పుడే ఎందుకు?
X

'నేరం నిరూపితం అయ్యే వరకు ముద్దాయి నిరపరాధే'... 'విన్నవన్నీ నిజాలు ఎప్పుడూ కావు.. ఓ ఘటనకు మూడు రకాల కథనాలు ఉంటాయి'.. ఈ రెండు ఫేమస్ కొటేషన్స్ అక్షరాలా నిజాలు అన్న విషయం తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ కోట్స్ పోస్ట్ చేశారు. దీంతో అవి ఫుల్ వైరల్ గా మారాయి. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.

అయితే కొటేషన్స్ ఇప్పుడే ఎందుకు నాగబాబు పోస్ట్ చేశారని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు జానీ మాస్టర్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న టైమ్ లో ఆయన పెట్టిన పోస్టులు అందుకు సంబంధించే అయ్యి ఉంటుందని అంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. నాగబాబు ట్వీట్స్ ఫుల్ వైరల్ అవుతుండగా.. జానీ మాస్టర్ కోసమే ఆయన కచ్చితంగా పోస్ట్ చేశారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

కాగా.. జానీ మాస్టర్ జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మెగా కుటుంబంతో కూడా జానీ మాస్టర్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్ ను పార్టీకి దూరంగా ఉండమని జనసేన ఇటీవల ఆదేశించింది. అయితే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన హైదరాబాద్ నార్శింగి పోలీసులు... రీసెంట్ గా బెంగళూరులో జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు.

తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ జూనియర్ కొరియోగ్రాఫర్ జానీపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైనర్ గా బాధితురాలు ఉన్న టైమ్ లో కూడా అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో.. పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. ఆ తర్వాత పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు తీవ్రంగా గాలించారు. తాజాగా అరెస్టు చేశారు.