Begin typing your search above and press return to search.

శోభితతో పెళ్లి.. సామ్ తో దిగిన ఆ పిక్ కూడా..

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 Oct 2024 5:35 AM GMT
శోభితతో పెళ్లి.. సామ్ తో దిగిన ఆ పిక్ కూడా..
X

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం నటుడు నాగార్జున ఇంట్లో సింపుల్ గా ఎంగేజ్మెంట్ జరగ్గా.. రీసెంట్ గా శోభిత పసుపు దంపుడు వేడుకకు సంబంధించిన పిక్స్ ను షేర్ చేశారు. అంటే పెళ్లి పనులు మొదలుపెట్టినట్లే. డిసెంబర్ లో చైతూ, శోభిత వివాహ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గ ఏర్పాట్లలో ఇప్పటికే ఇరువైపు కుటుంబీకులు నిమగ్నమై ఉన్నారట.

అయితే శోభితతో మరికొద్ది రోజుల్లో ఏడడుగులు నడవనున్న వేళ.. హీరో నాగచైతన్య తన మాజీ భార్య హీరోయిన్ సమంతతో దిగిన లాస్ట్ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా డిలీట్ చేశారు. నిజానికి.. కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న చైతూ, సామ్ 2017లో చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత పలు కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. డివోర్స్ అనౌన్స్మెంట్ తర్వాత తమ పెళ్లి ఫోటోలతో పాటు అప్పుడప్పుడు కలిసి దిగిన చిత్రాలు కూడా డిలీట్ చేశారు.

ఆ సమయంలో రేస్ ట్రాక్ లో సమంతతో దిగిన పిక్ ను మాత్రం చైతూ డిలీట్ చేయలేదు. అందులో రేస్ కారు ఎక్కుతూ ఇద్దరూ కనిపించారు. ఆ పోస్ట్ కు బ్యాక్ త్రో.. మిసెస్ అండ్ ది గర్ల్‌ఫ్రెండ్ అనే క్యాప్షన్ ను కూడా ఇచ్చారు. ఇప్పుడు శోభితతో పెళ్లికి సిద్ధమవుతున్న వేళ.. చైతూ ఆ ఫోటోను డిలీట్ చేయకపోవడంపై పలువురు నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పిక్ ఓకే కానీ.. క్యాప్షన్ కరెక్ట్ కాదని పోస్ట్ ను డిలీట్ చేయాలని సూచించారు. ఈ క్రమంలోనే చైతూ తొలగించినట్లు తెలుస్తోంది.

సమంతతో విడాకుల తర్వాత శోభితతో చైతూ ప్రేమలో ఉన్నారని చాలా నెలల పాటు వార్తలు వచ్చాయి. అనేక సార్లు వాళ్ళిద్దరూ కలిసి కనిపించారు. కానీ తాము స్నేహితులమనే చెప్పారు. నెటిజన్లు మాత్రం కచ్చితంగా ప్రేమనే ఫిక్స్ అయ్యారు. ఆగస్టులో నాగార్జున.. చైతూ, శోభిత ఎంగేజ్మెంట్ పిక్స్ ను షేర్ చేసి వారి పెళ్లి విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. త్వరలో ఏడడుగులు నడవనున్నారని తెలిపారు. బ్యూటిఫుల్ పిక్చర్స్ ను కూడా పోస్ట్ చేశారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. నాగ చైతన్య ప్ర‌స్తుతం తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన కొందరు మత్స్యకారుల జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌ గా న‌టిస్తున్న ఆ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, శోభిత న‌టించిన బాలీవుడ్ మూవీ ల‌వ్ సితార ఇటీవ‌ల నేరుగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.