Begin typing your search above and press return to search.

చైతూకు మాస్ వెల్ కమ్.. ఎంతైనా వారి కథేగా!

ఇటీవల ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరగ్గా.. ఇప్పుడు శ్రీకాకుళంలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. అందుకు గాను.. మూవీ టీమ్ అంతా సిక్కోలుకు చేరుకుంది.

By:  Tupaki Desk   |   19 Jun 2024 4:42 PM GMT
చైతూకు మాస్ వెల్ కమ్.. ఎంతైనా వారి కథేగా!
X

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఇప్పటికే చైతు, సాయి పల్లవి లవ్ స్టోరీలో కలిసి నటించగా.. ఇప్పుడు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు మత్స్యకారుల నిజ జీవిత ఘటనల ఆధారంగా తండేల్ తెరకెక్కుతోంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య.. మత్స్యకారుడి రోల్ లో కనిపించనున్నారు. అందుకోసం ఆయన కంప్లీట్ మేకోవర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్, పోస్టర్లలో లాంగ్ హెయిర్, పెద్ద గడ్డంతో ఊర మాస్ గా కనిపించారు. కొన్ని నెలలుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగ చైతన్య.. తండేల్ లో బాగా కష్టపడుతున్నారు. ఎలా అయినా హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరగ్గా.. ఇప్పుడు శ్రీకాకుళంలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. అందుకు గాను.. మూవీ టీమ్ అంతా సిక్కోలుకు చేరుకుంది. ఆ సమయంలో నాగ చైతన్యకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు అభిమానులు. చైతూకు గజమాల మాల వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. భారీ బైక్ ర్యాలీ కూడా చేపట్టారు. చైతన్య, సాయి పల్లవి కూడా ఓపెన్ టాప్ కారు ద్వారా అభివాదం చేసి ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపారు.

ఆ తర్వాత అరసవిల్లిలో ఉన్న సూర్య నారాయణ స్వామి ఆలయాన్ని చైతూ, సాయి పల్లవి సందర్శించారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో వారిని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు గుడి వద్దకు చేరుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్యకు ఉత్తరాంధ్రలో మంచి ఫ్యాన్ బేస్ ఉందని కామెంట్లు పెడుతున్నారు. మాస్ వెల్ కమ్ చెప్పారని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి శ్రీకాకుళం యాసలో అలరించనున్నారు. అందుకు గాను ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ బాణీలు కడుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆయనే అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 21వ తేదీన మూవీ రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.