Begin typing your search above and press return to search.

'గుంటూరు కారం' పై కాపీ మరక.. వాళ్ళకి నాగవంశీ మాస్ కౌంటర్?

యద్దనపూడి సులోచనారాణి రచించిన 'కీర్తి కిరీటాలు' అనే నవల నుంచి గుంటూరు కారం కథను త్రివిక్రమ్ కాపీ కొట్టినట్లు కొన్ని ఓ ప్రముఖ వెబ్సైట్ వార్తను ప్రచారం చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ కాస్త వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   5 Jan 2024 1:18 PM GMT
గుంటూరు కారం పై కాపీ మరక.. వాళ్ళకి నాగవంశీ మాస్ కౌంటర్?
X

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం' ఈ సంక్రాంతికి విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడూ తన సినిమాలతో క్లాస్ టచ్ ఇచ్చే త్రివిక్రమ్ ఈసారి మహేష్ తో ఊర మాస్ సినిమా చేస్తున్నాడు. రిలీజ్ టైం దగ్గర పడడంతో సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు లీకుల ద్వారా బయటికి వస్తున్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే, గుంటూరు కారం సినిమాని త్రివిక్రమ్ ఓ నవల ఆధారంగా తెరకెక్కించారట. యద్దనపూడి సులోచనారాణి రచించిన 'కీర్తి కిరీటాలు' అనే నవల నుంచి గుంటూరు కారం కథను త్రివిక్రమ్ కాపీ కొట్టినట్లు కొన్ని ఓ ప్రముఖ వెబ్సైట్ వార్తను ప్రచారం చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ కాస్త వైరల్ గా మారింది.

అయితే తాజాగా ఇదే విషయమై స్పందించిన నిర్మాత నాగ వంశీ ఈ న్యూస్ ని ప్రచారం చేసిన సదరు వెబ్ సైట్ కి కౌంటర్ గా ఆ వెబ్ సైట్ ని ట్యాగ్ చేస్తూ టిఆర్పి ని పెంచడం కోసం ఆ వెబ్సైట్ ఇలాంటి న్యూస్ ని స్ప్రెడ్ చేసినట్లు అర్ధం వచ్చేలా ఓ వీడియోని షేర్ చేసాడు. దాంతో సదరు వెబ్సైట్ కి నాగ వంశీ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. గుంటూరు కారం విషయంలో ఎలాంటి నెగటివ్ కామెంట్స్ వినిపించినా మహేష్, త్రివిక్రమ్ ల కంటే ముందు నాగ వంశీని రెస్పాండ్ అవుతూ వస్తున్నాడు.

సోషల్ మీడియాలో అయినా, బయట మీడియాతో అయినా ఇంట్రాక్ట్ అయినా ప్రతిసారి 'గుంటూరు కారం' పై ఏదో ఒక అప్డేట్ ఇస్తూ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేశారు. నిన్ననే గుంటూరు మూవీ సెన్సార్ పూర్తి చేసుకున్న విషయాన్ని నాగవంశీ ట్విట్టర్లో షేర్ చేస్తూ.." సినిమా చూడగానే మజా వస్తుంది. హార్ట్ బీట్ పెరుగుతుంది. ఈల వేయాలని అనిపిస్తుంది. బ్లాక్ బస్టర్ బొమ్మ లోడింగ్ జనవరి 4 డేట్ గుర్తు పెట్టుకోండి" అంటూ ట్వీట్ చేశారు.

అంతకంటే ముందు ఈ సినిమాతో రాజమౌళి రికార్డులకు దగ్గరగా వెళ్తామని చెప్పిన విషయం తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో మహేష్ కి జోడిగా శ్రీలీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రావు రమేష్, ఈశ్వరీ రావ్ కీలకపాత్రలు పోషించారు.