Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ లా ప‌వ‌న్ ద‌మ్మున్న నాయ‌కుడు! సీనియ‌ర్ న‌రేష్‌

ఈ నేప‌థ్యంలో తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ మ‌రోసారి ప‌వ‌న్ రాజ‌కీయం గురించి ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

By:  Tupaki Desk   |   2 Jun 2024 12:24 PM GMT
ఎన్టీఆర్ లా ప‌వ‌న్ ద‌మ్మున్న నాయ‌కుడు! సీనియ‌ర్ న‌రేష్‌
X

నిన్న వెలువ‌డిన ఎగ్జిట్ పోల్స్ లో ఫలితాల్లో జ‌న‌సేన అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురం నుంచి గెలుస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్న సంగ‌తి తెలిసిందే. గత ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం, గాజువాక‌లో ఘోర ప‌రాజ‌యం చ‌వి చూసినా ఈసారి పిఠాపురం నుంచి గెలిచి అన్ని లెక్క‌లు స‌రి చేస్తాడ‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. మ‌రి ఇది జ‌రుగుతుందా? లేదా? అన్న‌ది జూన 4న తేలుతుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ మ‌రోసారి ప‌వ‌న్ రాజ‌కీయం గురించి ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

ప‌ద‌వి ఆశించి పీకే రాజ‌కీయాల్లోకి రాలేదున్నారు. పీపుల్స్ ఆర్మీ ప్రారంభించి కోట్ల రూపాయ‌లు ప్ర‌జ‌ల‌కు విరాళంగా ఇచ్చార‌న్నారు. పవన్ కళ్యాణ్‌లో కసి ఉందని, ఏదో చేయాలనే తపన బ‌లంగా ఉంద‌న్నారు. ఎన్టీఆర్ త‌ర్వాత ద‌మ్ముతో నిల‌బ‌డిన నాయ‌కు పీకే అన్నారు. అప‌జ‌యాలు ఎదురైనా పారిపోకుండా నిల‌బ‌డి ముందుకెళ్లి, వారాహితో జ‌నాల్లో ఉన్నాడ‌ని, పీకేది అసాధార‌ణ పోరాటం అన్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌కు గ‌తంలో అవమానాలు జ‌రిగాయ‌ని, అవి, అందరి మనసులను తొలిచేశాయని న‌రేష్ అవేద‌న చెందారు.

ప‌వ‌న్ మ‌న‌సును కూడా అవి క‌ష్ట‌పెట్టి ఉంటాయ‌న్నారు. ఇండ‌స్ట్రీ నుంచి దీక్ష‌తో వెళ్లిన వ్య‌క్తా స‌క్స‌స్ అవుతున్నాడ‌ని ధీమా వ్య‌క్తం చేసారు. ప‌రిశ్ర‌మంతా ఆయ‌న‌కు స‌హ‌క‌రించాల‌న్నారు. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ ప్ర‌సంగంలో భాగంగా సీనియ‌ర్ ఎన్టీఆర్-కృష్ణ మ‌ధ్య ఉన్న వైరం గురించి మాట్లాడిన సంద‌ర్భంలో న‌రేష్ ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. పీకే వ్యాఖ్య‌లు త‌న‌ని బాధించాయ‌ని, అలా మాట్లాడి ఉండాల్సింది కాద‌న్నారు.

ఆ విష‌యం పై మ‌ళ్లీ మాట్లాడుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి మ‌ద్ద‌తుగా మాట్లాడారు. 'కృష్ణను పవన్ అనాలని అనలేదని, ఆ స్పీడ్ మొత్తం వింటే తాను ఏమ‌న్నారో అర్ధమవుతుందన్నారు. ఆ ట్వీట్ కూడా పవన్ కళ్యాణ్‌కి మంచి చేయాలనే పెట్టాన‌ని అన్నారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.