Begin typing your search above and press return to search.

నవీన్ పోలిశెట్టికి గాయాలు.. కోలుకోడానికి కొన్ని నెలలు టైమ్ పడుతుందంటూ పోస్ట్

అయితే సినిమాలకు దూరంగా ఉండటానికి ప్రమాదానికి గురవ్వడమే కారణమని తాజాగా పోలిశెట్టి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

By:  Tupaki Desk   |   17 July 2024 9:18 AM GMT
నవీన్ పోలిశెట్టికి గాయాలు.. కోలుకోడానికి కొన్ని నెలలు టైమ్ పడుతుందంటూ పోస్ట్
X

టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పొలిశెట్టి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' వంటి చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టి కూడా నవీన్ ఇంతవరకూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. నెలలు గడుస్తున్నా కొత్త సినిమాలు సంబంధించిన అప్డేట్ ఇవ్వలేదు. దీంతో యువ హీరో ఆరోగ్యం గురించి కొన్ని రూమర్స్ వినిపించాయి. అయితే సినిమాలకు దూరంగా ఉండటానికి ప్రమాదానికి గురవ్వడమే కారణమని తాజాగా పోలిశెట్టి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

నవీన్ పోలిశెట్టి ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. "లైఫ్ అప్డేట్. దురదృష్టవశాత్తూ నా చేతికి అనేక ఫ్రాక్చర్లు అయ్యాయి. నా కాలికి కూడా గాయమైంది. ఇది చాలా కష్టంగా ఉంది కానీ, మీ కోసం నా శక్తినంతా కూడగట్టుకొని పూర్తిగా కోలుకోడానికి కృషి చేస్తున్నాను. మీ సపోర్ట్, ఓర్పు, ప్రేమ మాత్రమే నాకు అవసరమైన మెడిసిన్. ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. దయచేసి నా నుండి వచ్చే అప్‌డేట్‌లను మాత్రమే నమ్మండి. త్వరలో బిగ్ స్క్రీన్‌పై మిమ్మల్ని అలరించడానికి వేచి చూస్తున్నాను. మీరంతా బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నాడు. దీనికి చేతికి కట్టుతో ఉన్న తన ఫోటోతో పాటుగా, సుదీర్ఘమైన నోట్ ను కూడా జత చేశాడు.

"ఈ రోజు మీతో నేనొక పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దురదృష్టవశాత్తూ, నా చేతి బోన్ కి తీవ్రమైన మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి, కాలికి కూడా ఇంజురీ అయ్యింది. ఇది నాకు చాలా టఫ్ అండ్ పెయిన్ ఫుల్ టైమ్. ముఖ్యంగా క్రియేటివ్ యాంగిల్ లో. ఈ ఇంజురీ వల్ల నేను ఫాస్ట్ గా మీ ముందుకు నా ఫిలిమ్స్ తీసుకురాలేకపోతున్నందుకు సారీ" అని నవీన్ పోలిశెట్టి పేర్కొన్నారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకోడానికి కొన్ని నెలల సమయం పడుతుందని, ప్రస్తుతం వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. త్వరలోనే స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

"గత కొన్ని రోజులు చాలా టఫ్ గా గడిచాయి. నేను కంప్లీట్ గా రికవర్ అయ్యి, మీకు నా బెస్ట్ ఎనర్జిటిక్ వెర్షన్ ని చూపించడానికి మెడికల్ ప్రొఫెషనల్స్ సహాయంతో వర్క్ చేస్తున్నాను. కానీ దానికి కొన్ని నెలలు టైమ్ పడుతుంది. నేను ముందు కంటే స్ట్రాంగ్ గా, హెల్తీ గా కమ్ బ్యాక్ అవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాను. గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు డెవలప్మెంట్ లో ఉన్న నా అప్ కమింగ్ ఫిలిమ్ స్క్రిప్ట్ అధ్బుతంగా, మీకు బాగా నచ్చే విధంగా రూపు దిద్దుకుంటున్నాయి. నేను పూర్తిగా రికవర్ అయ్యాక వాటి షూటింగ్ మొదలుపెడతాను. మీ లవ్ అండ్ ఎంకరేజ్మెంట్ యే నాకు అన్నీ. నేను తిరిగి మీ ముందుకు రావాలన్న ఆశకి అవే మోటివేషన్. మీ సపోర్ట్ కీ, పేషెన్స్ కీ చాలా థాంక్స్. అతి త్వరలో నేను మళ్ళీ స్క్రీన్ మీద కనిపించి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. మీరు ఎప్పటిలాగే నా మీద మీ ప్రేమని కురిపించడానికి సిద్ధంగా ఉంటారని అనుకుంటున్నాను.. మీ జానే జిగర్" అని నవీన్ తన ప్రకటనలో రాసుకొచ్చారు.

కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలతో తన ఉనికిని చాటుకున్న నవీన్ పోలిశెట్టి.. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రంతో హీరోగా మారాడు. త‌న‌దైన అద్భుత న‌ట‌న‌, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. 'చిచ్చోరే'తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన యువ హీరో.. 'జాతి రత్నాలు' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అతను రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలతో ఎంటర్టైన్ చేస్తారని అనుకుంటుండగా.. ఇప్పుడు ప్రమాదానికి గురయ్యారని తెలిసి అభిమానులు టెన్షన్ పడుతున్నారు. వీలైనంత త్వరగా కోలుకుని సినిమాలు చెయ్యాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.