Begin typing your search above and press return to search.

డిస్నీ ల్యాండ్‌లో న‌య‌న్ ఫ్యామిలీ షోలు!

అయితే ఈసారి విఘ్నేష్ కి డిస్నీ ల్యాండ్ కి వెళ్ల‌డం వెన‌క ఒక అద్భుత‌మైన మిస్ట‌రీ ఉంది.

By:  Tupaki Desk   |   1 Jun 2024 4:06 PM GMT
డిస్నీ ల్యాండ్‌లో న‌య‌న్ ఫ్యామిలీ షోలు!
X

దర్శకుడు విఘ్నేష్ శివన్ - నయనతార హాంకాంగ్ యాత్ర సంద‌డిగా సాగుతోంది. కుటుంబ విహారయాత్రలో తమ కవలలు ఉయిర్ - ఉలాగ్‌లతో అద్భుత‌ జ్ఞాపకాలను సొంతం చేసుకుంటోంది ఈ జంట‌. త‌మ జీవితంలో ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని అంద‌మైన ప్ర‌యాణంగా ఇది మారుతోంది. అయితే ఈసారి విఘ్నేష్ కి డిస్నీ ల్యాండ్ కి వెళ్ల‌డం వెన‌క ఒక అద్భుత‌మైన మిస్ట‌రీ ఉంది.


12 సంవత్సరాల క్రితం చెప్పులు, రూ. 1000తో ఇక్కడికి వచ్చానని విఘ్నేష్ గుర్తు చేసుకున్నారు. డిస్నీల్యాండ్ విహారం కేవలం వినోదభరితమైన విహారయాత్ర మాత్ర‌మే కాదు.. విఘ్నేష్‌కి అది నాస్టాల్జిక్ జర్నీ. పన్నెండేళ్ల క్రితం ప్ర‌యాణంతో పోలిస్తే ఇప్పటి ప్ర‌యాణం ఎంతో దూరంగా ఉందని అతడు ఇన్ స్టాలో వెల్ల‌డించాడు. ఆ సమయంలో యువకుడైన తాను కేవ‌లం జేబులో రూ. 1000తో అక్క‌డికి చేరుకున్నాడ‌ట‌. అది కూడా సిలంబరసన్ - వరలక్ష్మి శరత్‌కుమార్ నటించిన తన తొలి చిత్రం `పొడా పోడి` చిత్రీకరణకు అనుమతి కోరుతూ పార్కును సందర్శించాడు.


విఘ్నేష్ త‌మ‌ డిస్నీల్యాండ్ అడ్వెంచర్ నుండి అంద‌మైన‌ స్నాప్‌షాట్‌లను షేర్ చేసాడు. పార్క్ ఐకానిక్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర వారి కుమారులను ఎత్తుకుని గాల్లో ఉంచిన ఫోటోలు ఎంతో ఆక‌ర్షిస్తున్నాయి. విఘ్నేష్-న‌య‌న్ త‌మ క‌వ‌ల‌ల‌తో ఎంతో జాలీగా క‌నిపించారు. ఈ విహార యాత్ర నుంచి ర‌క‌ర‌కాల ఫోటోల‌ను సోష‌ల్ మీడియాల్లో ఈ జంట షేర్ చేస్తున్నారు. అవి వైర‌ల్‌గా మారుతున్నాయి.


ఫోటోలతో పాటు విఘ్నేష్ శీర్షిక హైలైట్ అయింది. కేవలం రూ. 1,000తో తన ప్రారంభ సందర్శన అనుభూతిని అత‌డు ఉద్వేగంగా రాసాడు. తన కుటుంబంతో కలిసి డిస్నీల్యాండ్ లో ఇప్పుడు చిద్విలాసంగా క‌నిపిస్తున్నాడు. అప్ప‌టితో పోలిస్తే ఇప్పుడు ఎంతో వైవిధ్యం అత‌డి జీవితంలో క‌నిపిస్తోంది. న‌య‌న్ రాక‌తో అత‌డిలో ఆనందం రెట్టింప‌యింద‌ని కూడా అర్థ‌మ‌వుతోంది. నా అంద‌మైన‌ మనోహరమైన పిల్లలతో ఇక్కడికి వచ్చినందుకు నా కుటుంబం మధురంగా, ఉద్వేగభరితంగా & సంతృప్తికరంగా ఉంది అని రాసాడు. నయనతార కూడా ఇన్ స్టా పోస్ట్ ల‌తో తమ ట్రిప్ గురించి అభిమానులను అప్‌డేట్ చేస్తూనే ఉంది. ఈ ఫోటోలు వారి హాంకాంగ్ అనుభవాల‌ను రిజిస్ట‌ర్ చేస్తున్నాయి. వర్షపు వీధిలో షికార్లు, విఘ్నేష్‌తో ముద్దుగా ఉండే క్షణాలు.. పిల్ల‌ల‌తో ఉన్న అరుదైన ఫోటోలు, సాధారణ దుస్తులతో న‌య‌న్ సోలో షాట్‌లు ఆక‌ట్టుకున్నాయి.


తమ కుటుంబ సమయాన్ని ఆస్వాదిస్తూనే, విఘ్నేష్- నయనతార ఇద్దరూ వ‌రుస‌ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. విఘ్నేష్ ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్, ఎస్జే సూర్య, కృతి శెట్టిలతో కలిసి లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే సినిమా చేస్తున్నాడు. నయనతార టెస్ట్, మన్నంగట్టి, డియర్ స్టూడెంట్స్ చిత్రాల‌తో బిజీగా ఉంది.