Begin typing your search above and press return to search.

'జైల‌ర్ -2' కోసం నెల్స‌న్ కి 55 కోట్లు అడ్వాన్స్!

తాజాగా ఈ సీక్వెల్ కి నెల్స‌ర్ దిలీప్ కుమార్ పారితోషికం కూడా అందుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని సినీ విశ్లేష‌కులు ట్వీట్ ద్వారా రివీల్ చేసారు. ఈ సినిమాకి గాను ఏకంగా 55 కోట్లు అడ్వాన్స్ గా తీసుకున్న‌ట్లు తెలిపారు.

By:  Tupaki Desk   |   27 Sep 2023 11:59 AM GMT
జైల‌ర్ -2 కోసం నెల్స‌న్ కి 55 కోట్లు అడ్వాన్స్!
X

ర‌జనీకాంత్ క‌థానాయ‌కుడిగా నెల్స‌న్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన 'జైల‌ర్' ఇటీవ‌ల రిలీజ్ అయి ఎలాంటి రికార్డులు న‌మోదు చేసిందో తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద 700 కోట్ల వ‌సూళ్ల‌తో భారీ విజ‌యం సాధించింది. కొన్నేళ్ల త‌ర్వాత ర‌జ‌నీ ఖాతాలో ప‌డిన స‌క్సెస్ ఇది. దింతో చిత్ర నిర్మాత క‌ళానిధి మార‌న్ ర‌జ‌నీకి అద‌నంగా 100కోట్లు పారితోషికం అందించ‌డం...ద‌ర్శ‌కుడికి..సంగీత ద‌ర్శ‌కుడికి అద‌నంగా ఖ‌రీదైన కార్లు ఇవ్వ‌డం చాలా హంగామానే న‌డించింది.

ఇదే ఉత్సాహంలో ఈ సినిమాకి సీక్వెల్ తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌క‌ట‌నైతే వ‌చ్చింది గానీ సీక్వెల్ అప్పుడే సాద్య‌మ‌వుతుందా? అన్న‌ది చాలా మంది సందేహం ఉంది. ర‌జ‌నీకాంత్..నెల్స్ న్ కి వేర్వేరు క‌మిట్ మెంట్లు ఉంటాయి. వాటిని పూర్తి చేయాలి. ఆ త‌ర్వాత ఇద్ద‌రు మ‌ళ్లీ ఇద్ద‌రు చేతులు క‌ల‌ప‌డానికి మ‌రికొంత స‌మ‌యం ప‌డుతుంది అని అంతా భావించారు. అయితే అంద‌రి ఊహ‌ల‌కు తెర దించుతూ జైల‌ర్ -2 వేగంగానే ప‌ట్టాలెక్కే అవకాశం ఉంద‌ని తేలిపోయింది.

తాజాగా ఈ సీక్వెల్ కి నెల్స‌ర్ దిలీప్ కుమార్ పారితోషికం కూడా అందుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని సినీ విశ్లేష‌కులు ట్వీట్ ద్వారా రివీల్ చేసారు. ఈ సినిమాకి గాను ఏకంగా 55 కోట్లు అడ్వాన్స్ గా తీసుకున్న‌ట్లు తెలిపారు. ఇది కేవ‌లం అడ్వాన్స్ మాత్ర‌మే. సినిమా రిలీజ్ త‌ర్వాత ఇంకా భారీ మొత్తంలో చెల్లించే దిశ‌గా ఒప్పందం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఇక ఈసినిమాని పాత టీమ్ తోనే తెర‌కెక్కించ నున్నారు. ర‌జ‌నీకాంత్ హీరోగా...అనిరుద్ సంగీతం అందించ‌నున్నారు. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించ‌నుంది.

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ రెండు సినిమాలు చేస్తున్నారు. వాటితో పాటే ఈ చిత్రాన్ని కూడా ప‌ట్టాలెక్కించాల‌ని చూస్తున్నారు. ఇది ర‌జ‌నీ అభిమానులు సూప‌ర్ న్యూస్ అనే చెప్పాలి. జైల‌ర్ లాంటి యాక్ష‌న్ సినిమా మ‌ళ్లీ ఎప్పుడొస్తుందా? అని క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూసేలా స‌మ‌యం ఇవ్వ‌కుండానే వేగంగా ప్రారంభించాల‌ని టీమ్ భావిస్తోంది. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ టీజే జ్క్షాన్ వేల్ తో ఓ సినిమా..లోకేష్ క‌న‌గ‌రాజ్ తో మ‌రో సినిమా చేస్తున్నారు. అలాగే ర‌జ‌నీ న‌టిస్తోన్న 'లాల్ స‌లాం' త్వ‌ర‌లో రిలీజ్ కానుంది.