Begin typing your search above and press return to search.

పిల్ల‌ల‌తో న‌య‌న్ వెకేష‌న్.. నెటిజ‌నులు వ‌దిలిపెట్ట‌రా?

ఓవైపు హాంకాంగ్ వెకేష‌న్‌లో న‌య‌తార‌- విఘ్నేష్ శివ‌న్ జంట ఆహ్లాద‌క‌ర‌మైన వెకేష‌న్ ని ఎంజాయ్ చేస్తూ ఇత‌ర జంట‌ల‌కు గోల్స్ నిర్ధేశిస్తోంది.

By:  Tupaki Desk   |   31 May 2024 5:35 AM GMT
పిల్ల‌ల‌తో న‌య‌న్ వెకేష‌న్.. నెటిజ‌నులు వ‌దిలిపెట్ట‌రా?
X

ఓవైపు హాంకాంగ్ వెకేష‌న్‌లో న‌య‌తార‌- విఘ్నేష్ శివ‌న్ జంట ఆహ్లాద‌క‌ర‌మైన వెకేష‌న్ ని ఎంజాయ్ చేస్తూ ఇత‌ర జంట‌ల‌కు గోల్స్ నిర్ధేశిస్తోంది. ఈ జంట‌తో పాటు వారి క‌వ‌ల కుమారులు (సరోగ‌సీ కిడ్స్) కూడా ఈ వెకేష‌న్ లో ఉన్నారు. అయితే న‌య‌న్ పై ఎప్ప‌టిలానే సోష‌ల్ మీడియాల్లో ఒక వ‌ర్గం త‌ప్పుడు కామెంట్లు చేస్తూనే ఉంది. న‌య‌న తార త‌న కుమారుల‌తో పాటు వెకేషన్ లో ఆనందిస్తున్న‌ ఒక అంద‌మైన ఫోటోని షేర్ చేసింది. దానికి ``హృదయం మరియు ఆత్మ`` అనే వ్యాఖ్య‌ను జోడిస్తూ రెండు హార్ట్ ఈమోజీల‌ను షేర్ చేసింది.


దానిపై నెటిజ‌నులు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ కామెంట్లకు చెక్ పెడుతూ ఒక అభిమాని ఇలా రాసారు. ``ఆగండి అబ్బాయిలు..ఇలా ప్రతి పోస్ట్‌లో ఇన్ని ప్రశ్నలు ఎందుకు? ఎప్పుడూ ఈ పిల్లాడు.. న‌య‌న్‌తోనే...!అది చాలా సహజం.. 1 పిల్లవాడు నాన్న లేదా అమ్మతో జతకట్టడం చాలా సహజం.. ఈ పిల్లాడు నయన్‌తో కూల్‌గా ఉంటాడు. మరొకరు విక్కీతో... వాళ్లకు అవతలి బిడ్డ అవసరం లేదని అర్థం కాదు...అమ్మా నాన్నల మీద ప్రేమ గురించి మనం ఎక్కువ & కనీసం కొంచెం తక్కువ చెబుతాం`` అని రాసారు. వెకేషన్ లో క‌వ‌ల పిల్ల‌ల్లో ఒక‌రు త‌ల్లి వ‌ద్ద మ‌రొక‌రు తండ్రి వ‌ద్ద ఉన్నారు. ఆ ఇద్ద‌రితో క‌లిసి అమ్మానాన్న ఉన్న‌ప్ప‌టి ఫోటోలు కూడా ఇదే ఫోటోషూట్ లో న‌య‌న‌తార షేర్ చేసారు. ఈ ఫోటోల్లో న‌య‌న్- విఘ్నేష్ జంట త‌మ పిల్ల‌ల‌తో ఎంతో హ్యాపీగా జాలీగా స్పెండ్ చేస్తూ క‌నిపించింది.


లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి హాంకాంగ్‌లో హాలిడేలో ఉంది. త‌న‌తో పాటు ఆమె భర్త ద‌ర్శ‌క‌నిర్మాత విఘ్నేష్ శివన్ .. వారి కవల అబ్బాయిలు ఉలాగ్- ఉయిర్ ఉన్నారు. వారి బిజీ షెడ్యూల్‌ల న‌డుమ విదేశీ విహార‌యాత్ర‌కు వెళ్ల‌డం అభిమానుల్లో చ‌ర్చ‌కు తావిచ్చింది. హాంకాంగ్ లో స్థానికంగా ల‌భించే రుచికరమైన వంటకాలను ఆస్వాధించ‌డం నుండి నగరంలోని గొప్ప సంస్కృతి సాంప్ర‌దాయాల గురించి తెలుసుకుంటున్నారు. ఈ జంట తమ సెలవులను పూర్తి స్థాయిలో ఆనందిస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. నయనతార తదుపరి `టెస్ట్`లో కనిపించనుంది. ఎస్ శశికాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్ మాధవన్, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా క్రికెట్ డ్రామా నేప‌థ్యంలో తెరకెక్కుతోంది. మలయాళంలో `డియర్ స్టూడెంట్స్` సినిమాకి న‌య‌న్ సైన్ చేసింది. ఆమె నివిన్ పౌలీ సరసన నటిస్తుంది. `లవ్ యాక్షన్ డ్రామా` తర్వాత నివిన్‌తో న‌య‌న్ కి మ‌ల‌యాళంలో రెండో సినిమా.