Begin typing your search above and press return to search.

పిఠాపురం క్రేజ్ ని మెగాడాట‌ర్ ఎన్ క్యాష్ చేసుకుంటుందా?

త‌మ నియోజ‌క వ‌ర్గం నుంచి త‌మ అభిమాన న‌టుడు అసెంబ్లీకి వెళ్ల‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   3 Aug 2024 1:26 PM GMT
పిఠాపురం క్రేజ్ ని మెగాడాట‌ర్ ఎన్ క్యాష్ చేసుకుంటుందా?
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురం నియోజ‌క వ‌ర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. అటుపై ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మంత్రి వ‌ర్గంలో ఉప ముఖ్య‌మంత్రిగానూ అవ‌కాశం క‌ల్పించారు. దీంతో మెగా ఫ్యామిలీ స‌హా అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవ్. ముఖ్యంగా పిఠాపురంనియోజ‌క వ‌ర్గం ప్ర‌జలు ఎంతో సంతోషంగా ఉన్నారు. త‌మ నియోజ‌క వ‌ర్గం నుంచి త‌మ అభిమాన న‌టుడు అసెంబ్లీకి వెళ్ల‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.


ప‌వ‌న్ పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్నారు అన‌గానే ఆ నియోజ‌క వ‌ర్గం దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. అంత‌వ‌ర‌కూ పిఠాపురం గురించి ఎవ‌రికీ తెలియ‌దుగానీ ప‌వ‌న్ ఎంట్రీతో ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చింది. ఇంకా కొంత మంది టాలీవుడ్ సెల‌బ్రిటీలు పిఠాపురంని హైలైట్ చేసారు. పిఠాపురంని ఆద‌ర్శ నియోజ‌క వ‌ర్గంగా త‌యారు చేసి చూపిస్తామ‌ని వాగ్దానాలు చేసారు.

అలాగే నాగ‌బాబు, వరుణ్ తేజ్, ప‌ద్మ‌జ‌, సాయితేజ్ అంతా పిఠాపురం ప్ర‌చారంలో పాల్గొన్న‌సంగ‌తి తెలిసిందే. పిఠాపురం ఓట‌ర్లు మొత్తం రెండు ల‌క్ష‌ల ముప్పై వేల‌కు పైగానే ఉన్నారు. స‌రిగ్గా ఇదే క్రేజ్ ని మెగా డాట‌ర్ నిహారిక ఎన్ క్యాష్‌చేసు కుంటున్న‌ట్లు నెట్టింట ప్ర‌చారంలోకి వ‌చ్చింది. నిహారిక నిర్మించిన `క‌మిటీ కుర్రాళ్లు` ఈనెల 9న రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే ప్ర‌చారం గ‌ట్టిగానే చేస్తోంది.

దీనిలో భాగంగా అమ్మ‌డు నేడు పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించింది. అక్కడి ప్ర‌జ‌లు, ప్రేక్ష‌కాభిమానుల‌తో కాసేపు ముచ్చటించింది. దానికి స‌బంధించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. మునుపెన్న‌డు పిఠాపురం వెళ్ల‌ని నిహారిక తొలిసారి వెళ్ల‌డంతో పాటు, ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌డం ఆస‌క్తికర‌కంగా మారింది. మొత్తానికి పిఠాపురం పేరిప్పుడు టాలీవుడ్ హబ్ లో చేరిపోయింది. సినిమా ఈవెంట్లు..షూటింగ్ లు కూడా ఆ ప్రాంతంలో చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.