Begin typing your search above and press return to search.

నిఖిల్ 'స్వయంభు'.. అప్డేట్స్ తోనే కిక్కిస్తున్నాడుగా..

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేయగా అందులో నిఖిల్ యుద్ధానికి సిద్దమవుతున్న పవర్ఫుల్ వారియర్ గా కనిపిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   1 Jun 2024 8:47 AM GMT
నిఖిల్ స్వయంభు.. అప్డేట్స్ తోనే కిక్కిస్తున్నాడుగా..
X

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించారు. ఇప్పుడు ఆయన వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. ప్రస్తుతం నిఖిల్ స్వయంభు మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. నిఖిల్ ఇందులో ఓ లెజెండరీ యోధుడిగా కనిపించనున్నారు.

ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన పోస్టర్లు, మేకింగ్ వీడియోలు సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేయగా అందులో నిఖిల్ యుద్ధానికి సిద్దమవుతున్న పవర్ఫుల్ వారియర్ గా కనిపిస్తున్నాడు. గతంలో ఎప్పుడూ లేనంత కొత్తగా అతను కనిపిస్తూ ఉండడం విశేషం.

ఇక సినిమాకు టాప్ సినిమాటోగ్రఫర్ కేకే. సెంథిల్ కుమార్ రంగంలోకి దిగడం విశేషం. ఆయనకు స్వాగతం పలుకుతూ ప్రత్యేకంగా ఒక మేకింగ్ వీడియో విడుదల చేశారు. బాహుబలి, RRR లాంటి సినిమాలకు వర్క్ చేసిన సెంథిల్ అనుభవం ఇలాంటి సినిమాలకు తప్పకుండా హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు. ఇక దీంతో సినిమాపై అంచనాల స్థాయి అమాంతం పెరిగిపోయింది.

ప్రస్తుతం మేకర్స్ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్ కోసం వరల్డ్ బెస్ట్ టెక్నీషియన్స్ ను రప్పించినట్లు హీరో నిఖిల్ స్వయంగా సోషల్ మీడియాలో తెలిపారు. పోస్టర్ కూడా షేర్ చేశారు. ఈ యాక్షన్ సీన్ ను 12 రోజుల పాటు దాదాపు 700 మందితో చిత్రీకరిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ ఒక్క సీన్ కోసం మేకర్స్ రూ.8 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు సమాచారం.

ఈ సీన్ సిల్వర్ స్క్రీన్ పై అదిరిపోనుందట. ఈ ఒక్క సీన్ కోసం రూ.8 కోట్లు పెట్టి షూట్ చేస్తున్నారంటే, సినిమా మొత్తం బడ్జెట్ ఎంత ఉంటుందోనని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా నిఖిల్ కెరీర్ లో మరో పాన్ ఇండియా హిట్ గా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. నిఖిల్ ఈ మూవీ కోసం బాగా కష్టపడుతున్నారు. కత్తి సాము, గుర్రపు స్వారీ, కర్ర సాము వంటి పలు విద్యలు నేర్చుకున్నారు.

ఒకప్పుడు రూ.8 కోట్ల బడ్జెట్ లో సినిమాలు చేసిన నిఖిల్, ఇప్పుడు ఆయన నటిస్తున్న మూవీలో ఒక్క యాక్షన్ సీన్ కు రూ.8 కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే గ్రేట్. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శంకర్ సంయుక్తంగా *స్వయంభు* మూవీని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. *కేజీఎఫ్*, *సలార్* వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.