Begin typing your search above and press return to search.

కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్న ముద్దుగుమ్మ.. నిజం ఎంత?

ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి మరొక మలయాళీ భామ యాడ్ అయ్యింది.

By:  Tupaki Desk   |   10 Jun 2024 7:30 AM GMT
కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్న ముద్దుగుమ్మ.. నిజం ఎంత?
X

ఈ మధ్యకాలంలో నటీనటులు అందరూ మొదట్లో ప్రేక్షకులకు పరిచయమైనప్పుడు ఒకలా.. కాస్త టైం గడిచి, ఫేమ్ సంపాదించాక మరొకలా కనిపిస్తున్నారు. తమ అందాలకు వీలైనంత మెరుగులు దిద్దుకొని ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. బాలీవుడ్ తారలతో పాటు ఎందరో టాలీవుడ్ తారలు పలు రకాల సర్జరీలు చేయించుకొని తమ రూపురేఖలను పూర్తిగా మార్చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి మరొక మలయాళీ భామ యాడ్ అయ్యింది.

నిమిషా సజయన్.. ఈ మలయాళీ బ్యూటీ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనకున్న టాలెంట్‌తో ఈ బ్యూటీ మొత్తం సౌత్ ఇండియాలోని అన్ని భాషలలో నటిస్తోంది. 2017లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ ప్రారంభంలో ఓ ప్రాముఖ్యత లేని పాత్ర పోషించినప్పటికీ క్రమంగా తనకంటూ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. నల్లని కలువలా ఉండే నిమిషా

అందమైన కళ్ళు.. చక్కటి నటన ప్రేక్షకుల మనసుని కట్టిపడేసాయి.

రీసెంట్‌గా ఆమె నటించిన జిగర్తాండ డబుల్ ఎక్స్, చిన్నా, నాయట్టు (కోట బొమ్మాళి పీఎస్) వంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. కెరీర్ పరంగా కాస్త స్పీడ్ పెంచే టైంలో నిమిషా అందం వెనుక కాస్మెటిక్ సర్జరీ కారణం అన్న రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం మొదలయ్యాయి. దీనికి ముఖ్య కారణం ఆమె రూపురేఖల్లో వచ్చిన మార్పు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. కెరీర్ ప్రారంభ దశలో నిమిషా ముఖం ఉన్న తీరుకి ప్రస్తుతం ఆమె ఉన్న తీరుకి మధ్య ఎంతో తేడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

ఇక సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై జోరుగా చర్చలు కూడా సాగుతున్నాయి. ఇక వీటిపై కాస్మటాలజిస్టులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను కూడా వెల్లడించడం మొదలుపెట్టారు. తాజాగా దీనిపై స్పందించిన డాక్టర్ శిఖా..నిమిషా బ్యూటీ వెనుక అసలు సీక్రెట్‌ని రివిల్ చేశారు. ఆమె చెప్పిన మాటలు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.నిమిషా ఎటువంటి కాస్మెటిక్ సర్జరీలు చేయించుకోలేదు అని తేల్చి చెప్పిన డాక్టర్ శిఖా.. అసలు సీక్రెట్‌ని వెల్లడించారు.

“నిమిషా కెరీర్ ప్రారంభ దశ కంటే కూడా ఇప్పుడు బాగా బరువు తగ్గారు. నాచురల్ గా కర్లీగా ఉన్న ఆమె హెయిర్ ను ఇప్పుడు స్ట్రైట్నింగ్ చేయించుకున్నారు. ఆమె పెదవులలో కానీ ముఖంలో కానీ ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ప్రస్తుతం మీరు ఆమెలో చూస్తున్న మార్పు సహజంగా వచ్చిందే అని అర్థమవుతుంది ” అని శిఖా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో చాలామంది నిమిషా సహజమైన అందం గురించి ప్రశంసలతో ఆమె ఇన్స్టా కామెంట్ సెక్షన్ నింపేస్తున్నారు.

ఆ విషయం పక్కన పెడితే.. గత కొద్దికాలంగా ఆమెపై సైబర్ అటాక్ జరుగుతుంది. ప్రముఖ మలయాళీ నటుడు సురేష్ గోపి త్రిసూర్ ఎన్నికల్లో గెలవరు అని ఆమె పెట్టిన కామెంట్స్ దీనికి ముఖ్య కారణం. కానీ సురేష్ గోపి ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో నిమిషా పై అతని అభిమానులు కొందరు ట్రోలింగ్ మొదలుపెట్టారు. అది తట్టుకోలేక నిమిషా తన సోషల్ మీడియాలో కామెంట్ సెక్షన్‌ను ఆఫ్ చేశారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో తనపై వస్తున్న ఈ రూమర్స్ గురించి నిమిషా ఎలా స్పందిస్తారో చూడాలి.