Begin typing your search above and press return to search.

వరుణ్ సందేశ్ 'నింద' టీజర్.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో!

'హ్యాపీడేస్' మూవీతో టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.

By:  Tupaki Desk   |   16 May 2024 6:40 AM GMT
వరుణ్ సందేశ్ నింద టీజర్.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో!
X

'హ్యాపీడేస్' మూవీతో టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. కానీ పలు మూవీలు ఫ్లాప్ కావడంతో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం తన వైఫ్ వితికతో బిగ్ బాస్ లో పాల్గొని మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. అప్పటి నుంచి వరుసగా సినిమాలు లైన్ లో పెడుతున్నారు.

ఇప్పుడు 'నింద' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు వరుణ్ సందేశ్. కాండ్రకోట మిస్టరీ అంటూ యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీని రాజేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథను అందించి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. మరికొద్ది రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. సినీ ప్రియుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ టీజర్ ను యువ నటుడు నవీన్ చంద్ర విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. టీజర్ చాలా బాగుందని 'నింద' మూవీ టీమ్ ను మెచ్చుకున్నారు. ప్రస్తుతం టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

'జీవితంలో కొన్ని సార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు' అంటూ తనికెళ్ల భరణి చెప్పిన డైలాగ్‌ తో ఎమోషనల్ గా 'నింద' టీజర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత సినిమాలోని పాత్రలను మేకర్స్ పరిచయం చేశారు. రెండే రెండు డైలాగులు ఉన్నా.. టీజర్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా సాగింది. అయితే టీజర్ లో ఎన్నో కోణాలు ఉన్నాయి. అందమైన ప్రేమ కథతో పాటు మర్డర్, క్రైమ్ మిస్టరీ కూడా సినిమాలో ఉన్నట్లు కనిపిస్తోంది. టీజర్ లో విజువల్స్ చాలా నాచురల్ గా ఉన్నాయి.

ముఖ్యంగా టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను ఫీల్ అయ్యేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సాగింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. వరుణ్ సందేశ్ తో పాటు ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, ఛత్రపతి శేఖర్, మైమ్ మధు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.