Begin typing your search above and press return to search.

పోలింగ్ బూత్ లో ఎన్టీఆర్ ముచ్చట్లు... వీడియో వైరల్!

ఇక జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి షాలిని, సతీమణి లక్ష్మి ప్రణతితో కలిసి వచ్చి ఓటు వేశారు.

By:  Tupaki Desk   |   30 Nov 2023 9:43 AM GMT
పోలింగ్  బూత్  లో ఎన్టీఆర్  ముచ్చట్లు... వీడియో వైరల్!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం మొదలైంది. ఉదయం నుంచే సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం తమ ఓటు హక్కుని ఉపయోగించుకునేందుకు పోలింగ్ బూత్ వద్దకి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని, నితిన్, కీరవాణి, తేజ, శివాజీ రాజా, సుమంత్.. ఇలా ఒక్కొక్కరిగా తమ ఓటుని వేసి వస్తున్నారు.


ఇక జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి షాలిని, సతీమణి లక్ష్మి ప్రణతితో కలిసి వచ్చి ఓటు వేశారు. సాధారణ ప్రజలతో పాటు తాను కూడా లైన్ లో నిలబడి వెళ్లి తమ ఓటుని వేసి వచ్చారు. ఈ సందర్భంగా ఓటు వేయడంకోసం క్యూలో ఉన్న సమయంలో అక్కడ ఉన్న కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కి సంబంధించిన వ్యక్తులతో జూనియర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

అవును... తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ హైదరాబాద్ లో పోలింగ్ బూత్ వద్ద భార్య, తల్లితోపాటు క్యూ లైన్ లో నిలబడిన ఎన్టీఆర్ ని మీడియా, యూట్యూబ్ ఛానల్స్ వ్యక్తులు ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారితో ఎన్టీఆర్ మాట్లాడారు.

ఇందులో భాగంగా... "మీరు ఓటు వేయరా.. ఇక్కడే ఉంటారా..?" అని జూనియర్ ఎన్టీఆర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఒక వ్యక్తి.. "మీరు ఓటు వేసిన తర్వాత వేస్తాము. అయితే అందరూ వేయము సగమే మందే వేస్తాము" అంటూ బదులిచ్చారు. అది విన్న ఎన్టీఆర్.. "సగం మంది వెయ్యరా!?" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

వారితో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో ఆయన భార్య, తల్లి చిరునవ్వులు చిందించడం కొసమెరుపు. ప్రస్తుతం ఈ వీడియో.. దీనికి సంబంధించిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా... జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం "దేవర" సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు పార్టులుగా రూపొందుతుంది. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి పార్ట్.. ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుందని చెబుతున్నారు.