Begin typing your search above and press return to search.

సినిమాల కంటే ఓటీటీ షోలలో లేడీకి స్కోప్

నివేదా పేతురాజ్ నటించిన వీడియో ఒక‌టి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోలో నివేద పోలీసులతో వాదిస్తూ కనిపించింది

By:  Tupaki Desk   |   13 Jun 2024 11:30 PM GMT
సినిమాల కంటే ఓటీటీ షోలలో లేడీకి స్కోప్
X

ఇటీవ‌ల చాలా మంది క‌థానాయిక‌ల ఫేట్ మార్చేస్తోంది ఓటీటీ. ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ తో ప్రియ‌మ‌ణి, స‌మంత లాంటి స్టార్ల రేంజ్ అమాంతం పెరిగింది. రాధికా ఆప్టే, కియ‌రా అద్వాణీ, త‌మ‌న్నా భాటియా, పాయ‌ల్ రాజ్ పుత్ స‌హా చాలా మంది క‌థానాయిక‌ల‌కు ఓటీటీలు మంచి పేరు తెచ్చాయి. ఇప్పుడు త‌మిళ‌న‌టి నివేదా పెతురాజ్ వంతు.

నివేదా పేతురాజ్ నటించిన వీడియో ఒక‌టి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోలో నివేద పోలీసులతో వాదిస్తూ కనిపించింది. నిజానికి నివేద న‌టిస్తున్న ఓటీటీ సిరీస్ కి సంబంధించిన ప్ర‌చార‌ వీడియో ఇది. ఈ షో జూన్ 14న ZEE5లో విడుదల కానుంది. ప‌రువు మ‌ర్యాద‌లు ప‌రువు న‌ష్టం నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర వెబ్ సిరీస్ ఇద‌ని తెలుస్తోంది. అందుకే నివేధ‌ పరువు ప్రచారంలో బిజీగా ఉంది. ఒక ఇంటర్వ్యూలో నివేద‌ OTT షోల గురించి తన అభిప్రాయాలను తెలిపింది. నివేదా పేతురాజ్ మాట్లాడుతూ ''నిజాయితీగా చెప్పాలంటే సినిమాల కంటే OTT ప్రాజెక్ట్‌లలో స్త్రీ పాత్రలకే ఎక్కువ స్కోప్ ఉంటుంది. మీలోని కళాకారుడిని సంతృప్తి పరచడానికి ఈ ప్రదర్శనలు అపారమైన అవకాశాలను అందిస్తాయి. పరువు ద్వారానే నాకు ఆ తృప్తి లభించింది. ఇప్పటి వరకు నేను అలాంటి అనుభూతి చెందలేదు. నాకు ఆ అనుభూతి కలగడం ఇదే మొదటిసారి. నేను చాలా మంచి పని చేశానని 100శాతం సంతృప్తి చెందాను.

ప్రముఖ దర్శకుడు పవన్ సాదినేని ఈ షోని తెర‌కెక్కించారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సుష్మిత కొణిదెల 'పరువు' సిరీస్ ని నిర్మించారు. నాగబాబు, నరేష్ అగస్త్య, ప్రణీతా పట్నాయక్ కీలక పాత్రలు పోషించారు. సిద్ధార్థ్ నాయుడు దర్శకత్వం వహించిన పరువు సిరీస్ తమిళంలో కూడా విడుదల కానుంది.