Begin typing your search above and press return to search.

యాంకర్ కి బిర్యానీ తినిపిస్తానన్న ఎన్టీఆర్‌..!

ఎన్టీఆర్‌ 'దేవర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.

By:  Tupaki Desk   |   20 Sep 2024 8:33 AM GMT
యాంకర్ కి బిర్యానీ తినిపిస్తానన్న ఎన్టీఆర్‌..!
X

ఎన్టీఆర్‌ 'దేవర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవ్వబోతున్న దేవర సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ఫుల్‌ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇటీవల ముంబై వెళ్లిన ఎన్టీఆర్‌ అండ్ టీం తాజాగా చెన్నైలో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్టీఆర్‌ తమిళంలో మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించాడు. అదే సమయంలో సమయస్ఫూర్తితో కామెంట్స్ చేయడం ద్వారా తమిళ మీడియాలో ప్రథానంగా కనిపిస్తూ దేవర సినిమాకు ఫుల్‌ పబ్లిసిటీ తెచ్చి పెట్టాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

మీడియా సమావేశం పూర్తి అయిన తర్వాత యాంకర్‌ వరుసగా ప్రశ్నలు అడుగుతూ ఉండగా ఎన్టీఆర్ ఓపికగా సమాధానాలు చెప్పాడు. అప్పుడే తమిళ సినిమా ఎప్పుడు చేస్తారంటూ ఆమె ప్రశ్నించగా, వెట్రిమారన్ సర్‌ ఎప్పుడు ఓకే అంటే అప్పుడే చేస్తాను. తమిళంలో అయినా పర్వాలేదు, తెలుగు లో డబ్‌ చేస్తాం అన్నాడు. ఆ తర్వాత పలు ప్రశ్నలు అడిగిన తర్వాత యాంకర్‌ ను ఉద్దేశించి ఎన్టీఆర్‌ మాట్లాడుతూ... మీరు నా ప్లాన్‌ నాశనం చేస్తున్నారు. నేను వెళ్లేటప్పుడు దిండిగల్‌ తలప్పకట్టి బిర్యానీ తీసుకు వెళ్లాలి అనుకున్నాను. కానీ మీ వల్ల ఆలస్యం అయ్యి అయిపోద్దేమో అన్నాడు.

వెంటనే యాంకర్‌ స్పందిస్తూ తప్పకుండా మీ కోసం ఆ బిర్యానీ ఉంటుందని చెప్పడంతో పాటు, మాకు బిర్యానీ లేదా అన్నట్లుగా తమిళంలో కామెంట్స్‌ చేయగా, తప్పకుండా దేవర రిలీజ్ తర్వాత మనం ఇద్దరం కలిసి వెళ్లి తిందాం అంటూ ఎన్టీఆర్‌ సమయస్ఫూర్తితో అనడంతో అక్కడ ఉన్న వారు అంతా నవ్వేశారు. ఎన్టీఆర్‌ స్టేజీ మీద అద్భుతమైన వక్త అనే విషయం తెల్సిందే. ఇలాంటి సందర్భాల్లో పంచ్‌ డైలాగ్స్ వేస్తూ సందర్భానికి తగ్గట్లుగా మాట్లాడటం ఎన్టీఆర్‌ కి వెన్నతో పెట్టిన విద్య. అందుకే తమిళ యాంకర్‌ ఫిదా అయ్యే విధంగా బిర్యానీకి వెళ్దాం అంటూ మాట్లాడి అందరిని సర్‌ప్రైజ్ చేయడం జరిగింది.

ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా లో బాలీవుడ్‌ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించాడు. ఎన్టీఆర్‌ ను డ్యుయెల్‌ రోల్‌ లో చూడబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ ఆదివారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను నిర్వహించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. మరో వైపు రిలీజ్‌ ట్రైలర్‌ ను సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్‌ కు ఈ సినిమా మరో వెయ్యి కోట్ల సినిమాగా నిలిచే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ చాలా నమ్మకంతో కనిపిస్తున్నారు.