Begin typing your search above and press return to search.

దేవ‌ర చూసేవ‌ర‌కూ బ‌తికించండి.. అభిమాని త‌ల్లిదండ్రుల వేడుకోలు!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నటించిన `దేవర: పార్ట్ 1` సెప్టెంబర్ 27న విడుదల కానుంది.

By:  Tupaki Desk   |   12 Sep 2024 4:43 AM GMT
దేవ‌ర చూసేవ‌ర‌కూ బ‌తికించండి.. అభిమాని త‌ల్లిదండ్రుల వేడుకోలు!
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నటించిన `దేవర: పార్ట్ 1` సెప్టెంబర్ 27న విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ఫ్యాన్స్ లో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ట్రైలర్ విడుదలైన తర్వాత విపరీతమైన ఉత్సాహాన్ని సృష్టించింది. అభిమానులు ప్ర‌స్తుతం రిలీజ్ డే కోసం వేచి చూస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. తార‌క్ పోస్టర్లు ఫ్లెక్సీల‌కు పాలాభిషాకాలు చేస్తూ...ఈ పాన్-ఇండియన్ సినిమా విడుదలకు ముందు త‌మ ఫేవ‌రెట్ స్టార్‌పై తమ ప్రేమను ప్రదర్శిస్తున్నారు. జూ. ఎన్టీఆర్ అభిమానుల నుండి సోషల్ మీడియా పోస్ట్‌లతో నిండిపోయింది.

అయితే ఇప్పుడు తార‌క్ కి ఒక కొత్త విన్న‌పం.. క్యాన్స‌ర్ తో చావు బ‌తుకుల మ‌ధ్య ఉన్న తార‌క్ అభిమాని కౌశిక్ త‌ల్లిదండ్రులు మీడియా ముందుకు వ‌చ్చి త‌మ బిడ్డ ప‌రిస్థితి గురించి వెల్ల‌డించారు. బ్ల‌డ్ క్యాన్స‌ర్ తో బెంగ‌ళూరులోని ఓ ప్ర‌యివేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్ (18) తాను చ‌నిపోయే ముందు దేవ‌ర సినిమా చూడాల‌నుకుంటున్నాన‌ని త‌న ఆకాంక్ష‌ను తెలిపాడు. తాను బ‌త‌క‌న‌ని, దేవ‌ర విడుద‌ల తేదీ సెప్టెంబ‌ర్ 27 వ‌ర‌కూ అయినా బ‌తికించాల‌ని డాక్ట‌ర్ల‌ను అత‌డు వేడుకున్న‌ట్టు త‌ల్లిదండ్రులు వెల్ల‌డించిన తీరు హృద‌యాల‌ను క‌ల‌చివేస్తోంది. తిరుప‌తిలో మీడియాతో మాట్లాడిన పేరెంట్ ఈ విష‌యంపై చంద్ర‌బాబు, ప‌వ‌న్, తార‌క్ స్పందించాల‌ని ప్రాధేయ‌ప‌డ్డారు. అభిమానుల‌కు క‌ష్టం ఉంది అంటే వెంట‌నే స్పందిస్తారు తార‌క్. ఇప్పుడు త‌న అభిమాని కౌశిక్ విష‌యంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

తార‌క్ కి పాలాభిషేకం:

దేవ‌ర రిలీజ్ ముంగిట సోషల్ మీడియాల్లో భారీ హంగామా నెల‌కొంది. కొంద‌రు అభిమానులు దేవ‌ర భారీ పోస్టర్లపై పాలు పోయడం, వాటిని పూలమాలలతో కప్పడం .. నుదిటిపై తిలకం వేయడం వంటి ఆచారాలు పాటిస్తున్న క్లిప్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. యంగ్ టైగర్ పై అభిమానులకు ఉన్న ప్రేమతో పండుగ వాతావరణం క‌నిపిస్తోంది.

దేవర: పార్ట్ 1 సముద్రాల నేపథ్యంలో సాగుతుంది. ట్రైలర్‌లో హై-ఆక్టేన్ యాక్షన్ ఇంటెన్స్ డ్రామా ఆక‌ట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి - కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. సైఫ్ అలీఖాన్ భయంకరమైన విల‌న్‌గా క‌నిపిస్తుండ‌గా, జాన్వీ ప‌ల్లెటూరి అమ్మాయిగా న‌టించింది.