Begin typing your search above and press return to search.

వైరల్‌ : దేవరను టచ్ చేసిన రియల్‌ షార్క్‌!

ఎన్టీఆర్‌ హీరోగా జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటించిన దేవర సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

By:  Tupaki Desk   |   25 Sep 2024 5:10 AM GMT
వైరల్‌ : దేవరను టచ్ చేసిన రియల్‌ షార్క్‌!
X

ఎన్టీఆర్‌ హీరోగా జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటించిన దేవర సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కథ సముద్రం నేపథ్యంలో సాగనుంది. సినిమాలో ఎన్టీఆర్‌ షార్క్‌ తో చేసే విన్యాసాలు ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్ చేస్తాయంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ప్రభాస్ గతంలో చత్రపతి సినిమాలో షార్క్ తో చేసిన పోరాటం ఇప్పటికీ హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు ఎన్టీఆర్‌ దేవరలో చేసిన షార్క్ ఫైట్‌ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే హీరోలు షార్క్‌ లతో ఫైట్ అనేది గ్రాఫిక్ మాయాజాలం. కానీ ఫ్యాన్స్ సాహసోపేతంగా షార్క్‌ వద్దకు వెళ్లిన విషయం వైరల్‌ అవుతోంది.

దేవర సినిమా విడుదల కాబోతున్న ఈ సమయంలో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ సముద్రంలో ఎన్టీఆర్‌ పోస్టర్ ను ఉంచడం జరిగింది. ఆ పోస్టర్ కి కాస్త దూరంలో కెమెరాలు ఉంచారు. ఒకానొక సమయంలో పెద్ద నిజమైన షార్క్ రానే వచ్చింది. ఆ షార్క్‌ ఎన్టీఆర్‌ దేవర పోస్టర్‌ ను టచ్‌ చేసింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆ విజువల్స్‌ వైరల్‌ అవుతున్నాయి. నెట్టింట ఎన్టీఆర్‌ కి ఉన్న ఫాలోయింగ్ ఏంటో మరోసారి ఈ వీడియో చెప్పకనే చెబుతోంది. ఇంతటి సాహసం చేసిన ఫ్యాన్స్‌ ఉన్నందుకు ఎన్టీఆర్‌ చాలా లక్కీ అనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు, నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు.

సముద్రంలో బ్యానర్‌ పెట్టి, దాన్ని కవర్ చేస్తూ కెమెరా ఉంచి, రియల్‌ షార్క్ వచ్చే వరకు వెయిట్‌ చేసిన ఆ ఫ్యాన్స్ పట్టుదలకు హ్యాట్సాఫ్ అంటూ ఫ్యాన్స్ నెట్టింట తెగ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దేవర సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్‌ లో సాగుతున్నాయి. పాన్‌ ఇండియా రేంజ్‌ లో దేవర సినిమా భారీ ఎత్తున విడుదల అవ్వబోతుంది. మొదటి రోజు వంద కోట్ల వసూళ్ల టార్గెట్‌ తో దేవర సినిమాను ప్రమోట్‌ చేసిన మేకర్స్ అదే స్థాయిలో భారీ ఎత్తున, అత్యధిక థియేటర్‌ లలో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో అదనపు షో లు, టికెట్ల పెంపుకు అనుమతులు వచ్చిన నేపథ్యంలో రికార్డ్‌ స్థాయి వసూళ్లు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఎన్టీఆర్‌ డ్యుయెల్‌ రోల్‌ లో కనిపించబోతున్న ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటించడం వల్ల అంచనాలు భారీగా పెరిగాయి. బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ ను ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటింపజేయడం వల్ల అంచనాలు మరింత పెరిగాయి. అనిరుద్‌ ఇచ్చిన సంగీతం సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంది. ఆకట్టుకునే అంశాలు సినిమాలో చాలానే ఉండబోతున్నాయి. కనుక సినిమా పాన్‌ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకోనుంది. ఇప్పటికే మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్‌ లు బ్రేక్‌ అవ్వడం మొదలైంది.