Begin typing your search above and press return to search.

వారసుల సినీ ఎంట్రీపై ఎన్టీఆర్‌ మాట..!

త్వరలోనే ఎన్టీఆర్‌ ఇద్దరు కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇస్తారనే చర్చ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   6 Oct 2024 10:48 AM GMT
వారసుల సినీ ఎంట్రీపై ఎన్టీఆర్‌ మాట..!
X

టాలీవుడ్ లో ఉన్న స్టార్‌ హీరోల్లో ఎక్కువ శాతం మంది వారసులు అనే విషయం తెల్సిందే. సీనియర్ స్టార్‌ హీరోలు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు వారసత్వంతో వచ్చారు. ఇప్పుడు మహేష్ బాబు, పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ఇలా చాలా మంది హీరోలు వారసత్వంతోనే వచ్చారు. వారసులు కాని వారు కొద్ది మందే ఉన్నారు. భవిష్యత్తులోనూ వారసులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. వెంకటేష్ తనయుడు హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలోనే ఎన్టీఆర్‌ ఇద్దరు కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇస్తారనే చర్చ జరుగుతోంది.

ఎన్టీఆర్‌ తన కొడుకులు ఇండస్ట్రీలో అడుగు పెట్టే విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దేవర పోస్ట్‌ రిలీజ్ ప్రమోషన్ లో భాగంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ తన ఇద్దరు కొడుకులు ఇండస్ట్రీలోకి వచ్చేది లేనిది ఇప్పుడే చెప్పలేను అన్నాడు. తన ఇష్టాలను, అభిరుచులను వారిపై రుద్దాలని అనుకోవడం లేదు. వారు ఇష్టంతో వస్తే పర్వాలేదు. వారిని బలవంతంగా ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చే ఉద్దేశం తనకు లేదు. తన విషయంలో నా తల్లిదండ్రులు ఎలా అయితే వ్యవహరించారో, నా అభిప్రాయానికి ఎలా అయితే గౌరవం ఇచ్చారో నేను అదే విధంగా వారి అభిప్రాయాలకు మద్దతు ఇస్తాను అన్నాడు.

వారు ఏం చేయాలి అనుకుంటే అది చేసేందుకు నేను ఆ వాతావరణం కల్పించాలని అనుకుంటున్నాను. అంతే తప్ప నా ఉద్దేశ్యాలను వారిపై రుద్దడం ద్వారా వారిని ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు. వారు ఇంకా చిన్న పిల్లలు. భవిష్యత్తులో ఏం కావాలి అనేది వారికి ఇప్పటికే ఒక అవగాహన రావడం అసాధ్యం. కనుక వారు వారి చిన్నతనంను ఎంజాయ్‌ చేయాలని అనుకుంటాను, వారిపై పెద్ద పెద్ద నిర్ణయాలు పెట్టి, ఒత్తిడి చేయాలని నేను అనుకోవడం లేదు. ముందు ముందు ఇండస్ట్రీ లో వారు ఎంట్రీ ఇస్తానంటూ తప్పకుండా మద్దతు ఉంటుంది అన్నట్లుగా ఎన్టీఆర్ తన వారసుల ఎంట్రీ గురించి చెప్పుకొచ్చాడు.

ఎన్టీఆర్‌ తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో నటించిన దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటించగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా రూపొందింది. మొదటి వారం రోజుల్లో ఈ సినిమా దాదాపుగా 400 కోట్ల రూపాయల వసూళ్లు నమోదు చేసింది. లాంగ్ రన్ లో రూ.550 కోట్ల వసూళ్లు నమోదు చేస్తుంది అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ద్వారా ఎన్టీఆర్‌ తన సాలిడ్‌ మాస్‌ ఇమేజ్‌ ను చూపించే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్‌ దేవర సినిమాలో డ్యుయెల్‌ రోల్‌ లో నటించిన విషయం తెల్సిందే. దేవర పార్ట్‌ 2 తో పాటు వార్‌ 2, ప్రశాంత్‌ నీల్ కాంబోలో సినిమా చేయబోతున్నాడు. వచ్చే ఏడాది వార్‌ 2 విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.