Begin typing your search above and press return to search.

బావమరిది కోసం రంగంలోకి దిగనున్న స్టార్ హీరో?

అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో తారక్ కూడా భాగం అవుతారని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   7 Aug 2024 2:06 PM GMT
బావమరిది కోసం రంగంలోకి దిగనున్న స్టార్ హీరో?
X

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ లో 'మ్యాడ్' సినిమాతో తెరంగేట్రం చేసిన నితిన్.. ఫస్ట్ మూవీతోనే మంచి హిట్టు కొట్టాడు. ఇప్పుడు ‘ఆయ్’ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాడు. గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా.. ఇండిపెండెన్స్ వీక్ లో రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో తారక్ కూడా భాగం అవుతారని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.


'ఆయ్' సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. రీసెంట్ గా వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్ర బృందం.. ఇప్పటికే పిఠాపురంలో ఓ ఈవెంట్ చేసింది. ఈ క్రమంలో గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించిందేకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్స్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ చీఫ్ గెస్టులుగా హాజరవుతారని తెలుస్తోంది. దీంతో రియల్ లైఫ్ లో బావా బావా అని పిలుచుకునే ఈ ఫ్రెండ్స్ ఇద్దరినీ ఒకే వేదిక మీద చూసే అవకాశం దొరుకుతుందని ఫ్యాన్స్ సంబర పడుతున్నారు.

'ఆయ్' సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రీమియర్స్ తో థియేటర్లలో విడుదల కానుంది. అదే రోజున డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ లాంటి రెండు తెలుగు చిత్రాలతో పాటుగా తంగలాన్ అనే డబ్బింగ్ మూవీ కూడా రిలీజ్ కాబోతోంది. భారీ చిత్రాల క్లాష్ లో ఇప్పుడు నార్నే నితిన్ నటించిన చిన్న సినిమా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఒకవేళ నిజంగానే ఎన్టీఆర్, బన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తే మాత్రం, ఈ సినిమాకి కావాల్సినంత బజ్ క్రియేట్ అవుతుంది. నందమూరి, అల్లు అభిమానుల సపోర్ట్ లభిస్తుంది. ఇది మంచి ఓపెనింగ్స్ రావడానికి సహాయ పడుతుంది.

నిజానికి ఎన్టీఆర్ తన బావమరిదికి మద్దతుగా ఇంతవరకూ ఒక్క ఫంక్షన్ కు కూడా అతిథిగా రాలేదు. 'మ్యాడ్' మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశాడే తప్ప, ఎలాంటి ప్రమోషనల్ ఈవెంట్స్ లోనూ భాగం అవ్వలేదు. కానీ ఇప్పుడు 'ఆయ్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తీసుకురావాలని గీతా ఆర్ట్స్ టీమ్ ట్రై చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అదనంగా అల్లు అర్జున్ ను కూడా ముఖ్య అతిథిగా తీసుకొస్తారని అంటున్నారు. దీనిపై మేకర్స్ సైడ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

'ఆయ్' చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటించగా.. అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య, శ్రీవాణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. రామ్ మిరియాల సంగీతం సమకూర్చారు.