Begin typing your search above and press return to search.

WAR 2లో NTR విల‌నీ యానిమ‌ల్‌ని కొట్టేలా?

ముఖ్యంగా ఈ సినిమాలో విల‌న్ గా న‌టిస్తున్న ఎన్టీఆర్‌కి ఉత్త‌రాదిన భారీ మార్కెట్‌ని అందిపుచ్చుకునే అవ‌కాశంగా భావిస్తున్నారు.

By:  Tupaki Desk   |   24 Nov 2023 1:30 PM GMT
WAR 2లో NTR విల‌నీ యానిమ‌ల్‌ని కొట్టేలా?
X

బ్లాక్ బ‌స్ట‌ర్ `వార్`కి సీక్వెల్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి వార్ 2 కోసం హృతిక్ రోషన్ తో టాలీవుడ్ అగ్ర‌హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేర‌డంతో YRF స్పై యూనివర్స్‌లో జోష్ మ‌రింత పెరిగింది. ఆర్.ఆర్.ఆర్ లాంటి ఆస్కార్ విన్నింగ్ సినిమాలో న‌టించిన తార‌క్ వ‌ల్ల `వార్ 2`కి పాన్ ఇండియా మార్కెట్ అమాంతం పెరిగిన‌ట్టేన‌ని విశ్లేషిస్తున్నారు. ఓటీటీ-శాటిలైట్ స‌హా థియేట్రిక‌ల్ బిజినెస్ ప‌రంగా మ‌రింత హైప్ పెర‌గ‌నుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ముఖ్యంగా ఈ సినిమాలో విల‌న్ గా న‌టిస్తున్న ఎన్టీఆర్‌కి ఉత్త‌రాదిన భారీ మార్కెట్‌ని అందిపుచ్చుకునే అవ‌కాశంగా భావిస్తున్నారు. ఇప్ప‌టికే వార్ 2 మొదటి షెడ్యూల్ అక్టోబర్ 2023లో స్పెయిన్‌లో పూర్తి కాగా, రెండో షెడ్యూల్‌ను అబుదాబిలో చిత్రీకరించనున్నారని తెలిసింది. హృతిక్ -ఎన్టీఆర్ ఫిబ్రవరి 2024లో సెట్స్ లో జాయిన్ అవుతార‌ని తాజాగా వెల్ల‌డైంది. రెండవ షెడ్యూల్ డిసెంబర్ 2023లో ప్రారంభమవుతుంద‌ని, అయితే ఆ ఇద్ద‌రు స్టార్లు ఫిబ్ర‌వ‌రిలో సెట్స్ లోకి చేరే అవ‌కాశం ఉంద‌ని టాక్ వినిపిస్తోంది.

మిడ్-డేలో ఒక క‌థ‌నం ప్రకారం, ``ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ చిత్రం షూటింగ్‌లో ఉన్నారు, ఆపై వార్ 2 కోసం తన మొదటి షెడ్యూల్‌ను కేటాయిస్తారు. ఎన్టీఆర్ కోసం భారీ యాక్షన్ బ్లాక్ తో ఎంట్రీని ప్లాన్ చేసార‌ని కూడా తెలిసింది. అంతేకాదు ఇటీవ‌ల విడుదలైన యానిమ‌ల్ ట్రైల‌ర్ లో విల‌న్ బాబి డియోల్ ఎంట్రీ ఒక రేంజులో అభిమానుల‌కు క‌నెక్ట‌యింది. అత‌డి ఎంట్రీ సంథింగ్ స్పెష‌ల్ గా ఆక‌ట్టుకుంది. ఇప్పుడు అంత‌కుమించిన యాక్ష‌న్ బ్లాక్ తో తార‌క్ ఎంట్రీ వార్ 2లో ఉంటుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. తొలిగా హృతిక్ తో తార‌క్ కి సంబంధించిన భాగాల షూటింగ్ ఫిబ్రవరిలో ముంబైలో నెల రోజుల షెడ్యూల్ తో ప్రారంభమవుతుంది. నాటకీయ (డ్రామా)త‌తో కూడుకున్న పార్ట్ ని ముందుగా చిత్రీక‌రించాక‌, యాక్షన్ సీక్వెన్స్‌లను తెర‌కెక్కిస్తార‌ని తెలిసింది.

ఇందులో కియారా అద్వానీ ఒక‌ కథానాయికగా నటిస్తుండగా, మ‌రో కథానాయిక‌గా ఆలియా న‌టించే అవ‌కాశం ఉంద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఈ చిత్రం 2025 రిపబ్లిక్ డే వారాంతంలో విడుదల కానుంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి `బ్ర‌హ్మాస్త్ర` ఫేం అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.