Begin typing your search above and press return to search.

మెగా హీరో ఆపరేషన్.. వ్వాటే స్పీడ్

ఫిబ్రవరి 16న రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది

By:  Tupaki Desk   |   11 Feb 2024 8:23 AM GMT
మెగా హీరో ఆపరేషన్.. వ్వాటే స్పీడ్
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఎప్పుడూ సరికొత్త కథలతో అలరించే ప్రయత్నం చేస్తుంటారు. గతేడాది వచ్చిన గాండీవధారి అర్జున చిత్రం ఆయనకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ప్రస్తుతం వరుణ్ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ చేస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్‍ డ్రాప్‍ లో యాక్షన్ థ్రిల్లర్‌ గా ఈ చిత్రం వస్తోంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.

ఫిబ్రవరి 16న రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ చిత్రం విడుదలవుతుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అయితే తన సినిమా ప్రమోషన్లలో ఎప్పుడూ పెద్దగా పాల్గొనని వరుణ్ తేజ్ ఇప్పుడు దూసుకుపోతున్నారు. తన స్టైల్ మార్చుకుని.. ఆపరేషన్ వాలెంటైన్ ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రతి ప్రమోషనల్ ఈవెంట్‌ లో పాల్గొంటూనే ఉన్నారు.

ఇటీవలే సైనికులతో పాటు ఇతర ప్రత్యేక అతిథుల సమక్షంలో సినిమాలోని వందేమాతరం సాంగ్ రిలీజ్ చేసేందుకు వరుణ్.. వాఘా బోర్డర్‌ కు వెళ్లారు. రెండో పాటను ఓ కళాశాలలో లాంచ్ చేసి.. అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. ప్రస్తుతం రెండు రోజులుగా ముంబయిలోనే ఉన్నారు. కేవలం రెండు రోజుల్లో 26 ఇంటర్వ్యూలు వరుణ్ ఇచ్చారట.

ఇక సోమవారం నుంచి వరుణ్.. తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో స్పెషల్ ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నారు. దీని బట్టి వరుణ్ ఈ సినిమా పట్ల ఎంత పర్టిక్యులర్ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి ప్రమోషన్లలో ఫుల్ బిజీగా గడుపుతున్న వరుణ్ ను చూసి ఈ మెగా హీరోలో ఎంత మార్పు వచ్చిందోనని సినీ పండితులు మాట్లాడుకుంటున్నారు.

ఈ సినిమా టీజర్ రిలీజైన తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి. ఉగ్రదాడికి సమాధానంగా.. పక్క దేశంపై భారత్ భారీ వైమానిక దాడులు చేయడం చుట్టూ ఈ మూవీ కథ ఉండనుందని టీజర్‌ ద్వారా తెలుస్తోంది. యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు మూవీ టీమ్ పేర్కొంది. భారత వైమానిక దళం ఆఫీసర్‌ గా ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నటించారు. యుద్ధ విమానాల విన్యాసాలు ఈ మూవీలో ఉండనున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటి మానుషీ చిల్లర్ హీరోయిన్‍ గా యాక్ట్ చేశారు. లవ్ స్టోరీ కూడా ఈ చిత్రంలో ప్రధానంగా ఉండనుందని తెలుస్తోంది.