Begin typing your search above and press return to search.

డెన్మార్క్‌లో ఇల్లు కొనుక్కున్న టాలీవుడ్ న‌టి

మార్చి 2024లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఈ ఏడాది కొంత‌ సమయాన్ని భారత్ లో.. మ‌రికొంత స‌మ‌యాన్ని డెన్మార్క్ లో గ‌డ‌పాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలిసింది.

By:  Tupaki Desk   |   31 July 2024 5:45 PM GMT
డెన్మార్క్‌లో ఇల్లు కొనుక్కున్న టాలీవుడ్ న‌టి
X

తాప్సీ పన్ను ఇటీవ‌లే మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోని ర‌హ‌స్యంగా పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. త‌న భ‌ర్త ప్ర‌తిభ‌, గొప్ప‌త‌నం గురించి, తాను అత‌డినే ఎందుకు ఎంపిక చేసుకుందో కూడా గ‌త ఇంటర్వ్యూలో తాప్సీ వెల్ల‌డించింది. మాథియాస్ డెన్మార్క్ వాసి. అంతేకాదు పెళ్లి త‌ర్వాతా ఆ ఇద్ద‌రూ కెరీర్ ప‌రంగా ఎవ‌రికి వారు బిజీగా ఉన్నారు. తాజా అప్ డేట్ ప్రకారం.. తాప్సీ- మాథియాస్ బో జంట‌ డెన్మార్క్‌లో కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. మార్చి 2024లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఈ ఏడాది కొంత‌ సమయాన్ని భారత్ లో.. మ‌రికొంత స‌మ‌యాన్ని డెన్మార్క్ లో గ‌డ‌పాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలిసింది.

తాజాగా భర్త మథియాస్ బోతో కలిసి డెన్మార్క్‌లో ఇల్లు కొనుగోలు చేసినట్లు తాప్సీ పన్ను ధృవీకరించింది. తాము రెండు విధాలుగా ముందుకు సాగుతామ‌ని వెల్ల‌డించింది. ప్రస్తుతం భారత జాతీయ బ్యాడ్మింటన్ జట్టుకు పురుషుల డబుల్స్ కోచ్‌గా ఉన్న మథియాస్ బో 2024 ఒలింపిక్స్ తర్వాత డెన్మార్క్‌లో ఎక్కువ సమయం గడపాలని యోచిస్తున్నాడు. తాప్సీ మరోవైపు భారతదేశంలో న‌టిగా త‌న కెరీర్ బండిని ముందుకు న‌డిపిస్తుంది. ఇక్క‌డ న‌టిస్తూనే అక్క‌డికి వెళ్లొస్తుందిట‌.

ఫీవర్ FMతో చాటింగ్ స‌మ‌యంలో తాప్సీ త‌న డెన్మార్క్ ఇంటి గురించి ప్ర‌స్థావించింది. ``మేము డెన్మార్క్‌లో ఒక ఇంటిని కొనుగోలు చేసాము. మేం రెండు విధాలుగా దూసుకుపోతాం. మేమిద్దరం ఒకే చోట ఉండలేము. అతడు స్పోర్ట్స్ పర్సన్.. నేను నటిగా చాలా కాలం పాటు బిజీగా ఉంటాను. మేము ఏడాదంతా ఒకే చోట ఉండ‌లేం. రెగ్యుల‌ర్ గా షూటింగ్ షెడ్యూల్‌లకు ఆటంకం కలిగించే కఠినమైన భారతీయ వాతావరణం నుండి తప్పించుకోవడానికి డెన్మార్క్‌లో వేసవికాలం గడపాలని యోచిస్తున్నట్లు కూడా తాప్సీ వెల్లడించింద‌ని ప్ర‌ముఖ హిందీ మీడియా త‌న క‌థ‌నంలో పేర్కొంది.

తాప్సీ ప్రస్తుతం తన త‌దుప‌రి చిత్రం `ఫిర్ ఆయీ హస్సేన్ దిల్‌రూబా`ను ప్రమోట్ చేస్తోంది. ఇది ఆగస్ట్ 9న విడుదల కానుంది. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ చిత్రం `ఫిర్ ఆయీ..`లో విక్రాంత్ మాస్సే , సన్నీ కౌశల్ కూడా నటించారు. ఇది కాకుండా `ఖేల్ ఖేల్ మే` ఆగస్టు 15న విడుదల కానుంది. ఇందులో అక్షయ్ కుమార్, అమ్మీ విర్క్, ఫర్దీన్ ఖాన్ , వాణి కపూర్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.