Begin typing your search above and press return to search.

గంటలోనే ఫినీష్ చేసిన పవన్

అంతేకాదు, కేవలం ఒక్క గంటలోనే ఈ సాంగ్‌ను ఆయన కంప్లీట్ చేసినట్లు కూడా ఇప్పుడు సమాచారం బయటకు వచ్చింది.

By:  Tupaki Desk   |   18 Oct 2024 12:47 PM GMT
గంటలోనే ఫినీష్ చేసిన పవన్
X

ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాలను చూసుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు స్టార్ హీరో పవన్ కల్యాణ్. గతంలో కొంత కాలం పాలిటిక్స్‌కు, ఎక్కువ సమయం కేటాయించిన ఆయన.. డిప్యూటీ సీఎం అయిన తర్వాత షూట్‌కు బ్రేక్ ఇచ్చేశారు. ఇలా చాలా కాలం పాటు మూవీలకు గ్యాప్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే పవన్ షూట్‌కు రీఎంట్రీ ఇచ్చారు.

రాజకీయాల నుంచి సినిమాలపై ఫోకస్ చేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తన ఫ్యూచర్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ఆయన ఇటీవలే ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ కోసం డేట్లు కేటాయించారు. పిరియాడిక్ జోనర్‌లో మొగల్ సామ్రాజ్యం బ్యాగ్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్టును చాలా వరకూ కంప్లీట్ చేసుకున్నారు.

క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో మొదలై.. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఫినిష్ అవుతున్న ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌ను పెడుతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ, దీనిపై ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దీంతో ఎవరికి తోచిన విధంగా వాళ్లు మాట్లాడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఇందులో ఓ ప్రత్యేకమైన గీతం సెట్ చేసినట్లు క్లారిటీ వచ్చింది.

ఇక ఆ స్పెషల్ సాంగ్‌ను పవన్ కల్యాణే స్వయంగా పాడుతున్నారని వార్తలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ తాజాగా ఆయన ఈ పాటను ఆలపించారని తెలిసింది. అంతేకాదు, కేవలం ఒక్క గంటలోనే ఈ సాంగ్‌ను ఆయన కంప్లీట్ చేసినట్లు కూడా ఇప్పుడు సమాచారం బయటకు వచ్చింది.

పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ‘హరిహర వీరమల్లు’ మూవీకి RRRతో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన నేతృత్వంలోనే పవన్ కల్యాణ్ పాటను పూర్తి చేశారట. ఈ పాట ఎంతో కష్టంతో కూడుకుని ఉంటుందట. అయినప్పటికీ పవర్ స్టార్ ఎంతో సులభంగా దీన్ని కంప్లీట్ చేశారనే టాక్ వినిపిస్తోంది.

‘హరిహర వీరమల్లు’ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఇందులో బాబీ డియోల్ సహా కొందరు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.