Begin typing your search above and press return to search.

DCM ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స్నేహితులిద్ద‌రు క‌లిసిన వేళ‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చెప‌ట్టిన నాటి నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ బిజీ బిజీగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 July 2024 7:00 AM GMT
DCM ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స్నేహితులిద్ద‌రు క‌లిసిన వేళ‌!
X

ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చెప‌ట్టిన నాటి నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ బిజీ బిజీగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. అధికారుల‌తో స‌మావేశాలు...ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై వినతులు వంటి వాటితో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నారు. అయితే తాజాగా చాలా కాలానికి స్నేహితులు త్రివిక్ర‌మ్-ఆనంద్ సాయిల‌తో ప‌వన్ క‌ళ్యాణ్ క‌నిపించారు. నేడు విజ‌య‌వాడ‌కు చేరుకున్న సంద‌ర్భంగా ప‌వ‌న్ తో పాటు త్రివిక్ర‌మ్...ఆనంద్ సాయి కూడా హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు క‌లిసొచ్చారు.

గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా మంగ‌ళ‌గిరి చేరుకున్నారు. డీసీఎమ్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత త్రివిక్ర‌మ్ తో క‌ల‌వ‌డం ఇదే తొలిసారి. ఏడాది కాలంగా ప‌వ‌న్ రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌టంతో ఎక్క‌డా త్రివిక్ర‌మ్ క‌నిపించ‌లేదు. ప్ర‌చారం స‌మ‌యంలో గురూజీ కూడా తోడ‌వుతాడ‌ని ప్ర‌చారం సాగింది గానీ ఆయ‌న బ‌య‌టకు రాలేదు. ప‌వ‌న్ స్పీచ్ ల వెనుక త్రివిక్ర‌మ్ ఉన్నార‌ని ఎప్ప‌టి నుంచో ఉంది.

ఆయ‌న రాజ‌కీయ ప్ర‌సాంగాల‌న్ని త్రివిక్ర‌మ్ రాస్తాడ‌ని ప్ర‌చారంలో ఉంది. అలాగే ఛాన్స్ దొరిక‌న‌ప్పుడ‌ల్లా ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి గురూజీ కూడా అదే రేంజ్ లో ప‌వ‌న్ వ్య‌క్తిత్వాన్ని హైలైట్ చేస్తుంటారు. ఇక పవ‌న్ కి మ‌రో ప్రాణ స్నేహితుడు ఆనంద్ సాయి. ప‌వ‌న్ ఇండ‌స్ట్రీకి రాక ముందు నుంచే ఆనంద్ సాయి స్నేహి తుడు. అయితే వీరిద్ద‌రు ప‌వ‌న్ తో మంగ‌ళ‌గిరి రావ‌డానికి ఓ కార‌ణం క‌నిపిస్తుంది.

ప్రస్తుతం పవన్ ఉపయోగిస్తున్న క్యాంపు కార్యాలయాన్ని పునరుద్ధరించడంలో పవన్ సన్నిహితుడు ఆనంద్ సాయి కీలకంగా వ్యవహరించారు. అత‌డు ప్ర‌ముఖ ఆర్ట్ డైరెక్ట‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే. అలాగే ప‌వ‌న్ ..గురూజీతో రాజ‌కీయంగా తీసుకురావాల్సిన మార్పుల గురించి క్యాంప్ ఆఫీస్ లో ఏదైనా చ‌ర్చ పెడుతున్నారా? అన్న‌ది తెలియాలి.