Begin typing your search above and press return to search.

పవన్ OG.. ఆరోజు పెద్ద సౌండే!

పవన్‌ ఓజీ బ్లాస్ట్ ఆన్ ది వే అంటూ పోస్ట్ పెట్టారు. స్పీకర్స్ పిక్ కూడా షేర్ చేశారు. దీంతో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవ్వనున్నట్లు అర్ధమైంది.

By:  Tupaki Desk   |   18 Jun 2024 7:21 AM GMT
పవన్ OG.. ఆరోజు పెద్ద సౌండే!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇటీవల ఏపీ ఎన్నికల్లో ఎలాంటి విజయం సాధించారో అందరికీ తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ గా వ్యవహరించిన ఆయన.. పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుపొందారు. పదేళ్లుగా ప్రజల్లో ఉన్న ఆయన.. తొలిసారి చట్టసభల్లో అడుగు పెట్టనున్నారు. త్వరలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే పవన్ గెలిచాక.. సుజిత్ మూవీ ఓజీ నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు.

రగిలే రివెంజ్ అంటూ మేకర్స్ షేర్ చేసిన పోస్టర్ వేరే లెవెల్ లో ఉంది. అంతకుముందు మేకర్స్.. విడుదల చేసిన గ్లింప్స్ తోపాటు పోస్టర్లు కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఓజీ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. కానీ ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.

దీంతో ఫ్యాన్స్.. మేకర్స్ నుంచి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో ఓజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. పవన్‌ ఓజీ బ్లాస్ట్ ఆన్ ది వే అంటూ పోస్ట్ పెట్టారు. స్పీకర్స్ పిక్ కూడా షేర్ చేశారు. దీంతో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవ్వనున్నట్లు అర్ధమైంది. స్పీకర్లు బద్దలైపోవడం గ్యారంటీ అని పోస్ట్ ద్వారా తెలుస్తుంది. పవన్ డిప్యూటీగా బాధ్యతలు స్వీకరించే సమయంలో ఆ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు టాక్.

అయితే ఈ సినిమాలో పవన్ ఓ పాట పాడుతారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆయనతో పాడించడానికి అవకాశాలను పరిశీలిస్తున్నామని తమన్ ఓ ప్రోగ్రామ్ లో చెప్పారు. ఇప్పటికే జానీ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాల్లో పాటలు పాడి అలరించారు పవన్. చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి మూవీకి కూడా తన వాయిస్ వినిపించారు. ఇప్పుడు ఓజీ కోసం మరోసారి తన వాయిస్ వినిపించనున్నారని వినికిడి.

ఇక సినిమా విషయానికి వస్తే.. గ్యాంగ్ లీడర్‌ ఫేమ్ ప్రియాంకా అరుల్ మోహన్‌ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. టాలీవుడ్ నటుడు వెంకట్‌, కోలీవుడ్ భామ శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్, హరీష్, ఉత్తమన్ నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా రవి కే చంద్రన్, ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా ఏఎస్ ప్రకాష్ వ్యవహరిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.