Begin typing your search above and press return to search.

కూతురితో పవన్.. వ్వాటే క్యూట్ మూమెంట్

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొని ప్రజలని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.

By:  Tupaki Desk   |   15 Aug 2024 9:46 AM GMT
కూతురితో పవన్.. వ్వాటే క్యూట్ మూమెంట్
X

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిపాలన వ్యవహారాలలో బిజీగా ఉన్నారు. తాజాగా ఇండిపెండెంట్స్ డే సందర్భంగా కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ జెండా వందనం చేశారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొని ప్రజలని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఇక ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ కూతురు ఆధ్యా కూడా పాల్గొంది. కొద్ది రోజులుగా ఆమె పవన్ కళ్యాణ్ తో పాటే ఉంటున్నారు.

కాకినాడలో జెండా వందనం తర్వాత సభా వేదిక మీద పవన్ కళ్యాణ్ కూతురు ఆధ్యతో కలిసి సెల్ఫీ దిగారు. ఈ మూమెంట్ ని మీడియా ప్రతినిధులు తమ కెమెరాలలో చిత్రీకరించారు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం శ్రీహరి కోట స్పేస్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆ ఈవెంట్ కి కూడా తండ్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఆధ్య అటెండ్ అయ్యింది.

ఇదిలా ఉంటే ఆధ్యతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ దిగిన పిక్ ని పవర్ స్టార్ అభిమానులు విపరీతంగా ఫ్యాన్స్ గ్రూప్స్ లలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికలలో గెలిచిన తర్వాత అకిరా నందన్ కొన్ని రోజులు అతనితో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో కలిశారు. ఆ ఫోటోలలో అకిరా నందన్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారానికి అకిరా, ఆధ్య హాజరయ్యారు.

ఇప్పుడు ఇండిపెండెంట్స్ డే సెలబ్రేషన్స్ లో పవన్ కళ్యాణ్ తో పాటుగా కూతురు ఆధ్యా కూడా పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మంత్రిగా పరిపాలనా వ్యవహారాలలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. రెగ్యులర్ గా అధికారులతో మీటింగ్ లు నిర్వహిస్తూ శాఖల వారీగా కార్యక్రమాలపై ఫోకస్ చేశారు. మరో వైపు పవన కళ్యాణ్ ఇప్పటికే మూడు సినిమాలు కమిట్ అయ్యి ఉన్నారు.

ఈ సినిమాలలో రెండు చివరి దశలో ఉన్నాయి. అక్టోబర్ నుంచి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలకి డేట్స్ ఇచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ షూటింగ్ మొదటిగా స్టార్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. దీని తర్వాత హరిహరవీరమల్లు సినిమా షూట్ మొదలెట్టవచ్చని సమాచారం. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాదిలోనే రిలీజ్ అవుతాయని తెలుస్తోంది.