Begin typing your search above and press return to search.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ "రణమండల"- పోస్టర్ తోనే థ్రిల్ అయ్యేలా

ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌లో హనుమంతుడిని భీకరమైన రూపంలో చూపించారు.

By:  Tupaki Desk   |   26 Oct 2024 2:22 PM GMT
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రణమండల- పోస్టర్ తోనే థ్రిల్ అయ్యేలా
X

ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విభిన్నమైన ప్రాజెక్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇక వారి కొత్త పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రణమండల’ను అధికారికంగా ప్రకటించారు. మైతాలజీ, యాక్షన్ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం, రణమండల ఆంజనేయ స్వామి కథతో ప్రేక్షకులను అలరించనుంది. ప్రముఖ నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ ను ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ నిర్మాణ సంస్థ ద్వారా రూపొందిస్తున్నారు.


ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌లో హనుమంతుడిని భీకరమైన రూపంలో చూపించారు. ఆయన వీరత్వంతో ముందుకు కదిలిపోతూ కనిపిస్తున్న ఈ పోస్టర్, ఆయన శక్తిని, ధైర్యాన్ని ప్రతిబింబిస్తుందని అందరికీ అర్థమవుతోంది. పోస్టర్‌లో చిన్న పిల్ల అమ్మాయి హనుమంతుడి వైపు ప్రార్థనతో నిలబడి ఉండటం, ఈ కథలో ఆమె పాత్ర కీలకమైనదని తెలియజేస్తోంది.

‘రణమండల’ చిత్రం మైతాలజీ జోనర్‌కు సంబంధించిన నూతన అంశాలను చేర్చి రూపొందించబోతోంది. హనుమంతుడి వీరత్వాన్ని సరికొత్త కోణంలో చూపించడానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ యూనిట్ చాలా శ్రద్ధగా పని చేస్తోంది. ఈ మైతాలజీ కథను ఆధునిక సాంకేతికతలతో గడియించేలా చిత్రీకరించనున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, హనుమంతుడి శౌర్యాన్ని చూపించే సీన్స్ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తాయని తెలుస్తోంది.

‘రణమండల’ చిత్రంలో నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్ లో టాప్ క్లాస్ టెక్నికల్ టీమ్ ను, ఆర్టిస్టుల ను తీసుకోవాలని భావిస్తోందని సమాచారం. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలని యూనిట్ సంకల్పించింది. గత చిత్రం "కార్తికేయ 2" ద్వారా పీఏం ఫ్యాక్టరీకి మంచి పేరు వచ్చింది, ఇక ఇప్పుడు ‘రణమండల’ తో మరోసారి అదే తరహాలో ఆకట్టుకుంటామని నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్ చెప్పారు.