Begin typing your search above and press return to search.

పూరీకి ఖర్చు లేని ప్రమోషన్స్..!

లేటెస్ట్ గా బీఆర్ఎస్ నేతలు సతీష్ కుమార్, రజితా రెడ్డి ఈ విషయంపై ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పై ఫిర్యాదు చేశారు.

By:  Tupaki Desk   |   18 July 2024 12:43 PM GMT
పూరీకి ఖర్చు లేని ప్రమోషన్స్..!
X

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే సినిమాలను అందించిన పూరీ జగన్నాథ్ ఈమధ్య తన స్థాయికి తగిన సినిమాలు ఇవ్వలేకపోతున్నాడు. పూరీ మార్క్ సినిమా వస్తే అది బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. తక్కువ రోజుల్లో ఎక్కువ ఇంపాక్ట్ కలిగించే సినిమాలు చేయడంలో పూరీ సిద్ధహస్తుడు. ఐతే ఎందుకో ఈమధ్య పూరీ తన రేంజ్ సినిమాలు చేయలేకపోతున్నాడు.

టెంపర్, ఇస్మార్ట్ శంకర్ తో తిరిగి ఫాం లోకి వచ్చాడని అనుకోగా లైగర్ తో బాబోయ్ అనిపించేశాడు. ఇక ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ తో మరోసారి తన లక్ టెస్ట్ చేసుకోవాలని చూస్తున్నాడు. పూరీ డైరెక్షన్ లో రామ్ హీరోగా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేస్తూ నేషనల్ లెవెల్ లో హిట్ కొట్టాలని చూస్తున్నాడు పూరీ జగన్నాథ్.

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి రీసెంట్ గా మార్ ముంతా చోడ్ చింతా సాంగ్ రిలీజైంది. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని ఈ సాంగ్ మాస్ ఆడియన్స్ కు ఫీస్ట్ అందించింది. ఐతే ఈ సాంగ్ లోని ఒక డైలాగ్ బీఆర్ఎస్ నేతలకు ఆగ్రహాన్ని తెప్పించింది. సాంగ్ లో భాగంగా ఏం చేద్దాం అంటావ్ మరి అనే మాట వాడారు. ఇది బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు తరచు అనే డైలాగ్. అయితే పాటలో ఆయన్ని ఉద్దేశించి కాకపోయినా మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ బీఆర్ఎస్ నేతలు ఈ సాంగ్ పై విమర్శలు చేస్తున్నారు.

లేటెస్ట్ గా బీఆర్ఎస్ నేతలు సతీష్ కుమార్, రజితా రెడ్డి ఈ విషయంపై ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పై ఫిర్యాదు చేశారు. సాంగ్ లో డైలాగ్ తొలగించాలని వారు కోరారు. ఐతే ఫిర్యాదు తీసుకున్న పోలీసులు చిత్ర యూనిట్ నుంచి రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఐతే ఈ ఇష్యూ వల్ల డబుల్ ఇస్మార్ట్ సినిమాకు విపరీతమైన ఫ్రీ ప్రమోషన్ జరుగుతుంది. పూరీ జగన్నాథ్ ఈ ఇష్యూపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.