Begin typing your search above and press return to search.

చంద్ర‌బోస్ ఖాతాలో మ‌రో అవార్డు!

పొన్నం సత్తయ్య గౌడ్ మూడ‌వ మెమోరియల్ అవార్డుకు ప్రముఖ సినీగేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, బలగం ఫేం కొమురయ్య, మొగిలయ్యలు ఎంపికయ్యారు.

By:  Tupaki Desk   |   10 Sep 2024 5:49 AM GMT
చంద్ర‌బోస్ ఖాతాలో మ‌రో అవార్డు!
X

పొన్నం సత్తయ్య గౌడ్ మూడ‌వ మెమోరియల్ అవార్డుకు ప్రముఖ సినీగేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, బలగం ఫేం కొమురయ్య, మొగిలయ్యలు ఎంపికయ్యారు. ఈనెల 13న రవీంద్ర భారతి వేదికగా అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ జ్ఞాపకార్థం వారి సోదరులు, కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం రచయితలకు , కళాకారులకు పొన్నం సత్తయ్య గౌడ్ మెమోరియల్ అవార్డు అందిస్తున్నారు.

ప్రతి సంవత్సరం పొన్నం సత్తయ్య గౌడ్ మెమోరియల్ అవార్డు ఇస్తున్న మాదిరి ఈసారి కూడా కమిటీ పలువురు రచయితలు, కళాకారుల పేర్లను పరిశీలించింది. తుదిగా రచయితల విభాగంలో ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, కళాకారుల విభాగంలో `బలగం` ఫేమ్ కొమురమ్మ, మొగిలయ్యలను అవార్డు గ్రహీతలుగా ఎంపిక చేశారు. ఎంపిక చేసిన పేర్లను కమిటీ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు అందజేశారు. అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి 51 వేల రూపాయల నగదు, మెమోంటోతో సత్కరిస్తామని కమిటీ కన్వీనర్ పొన్నం రవిచంద్ర తెలిపారు.

అవార్డు గ్రహీతలకు ఈనెల 13న పొన్నం సత్తయ్య గౌడ్ 13వ వర్ధంతి సందర్భంగా రవీంద్ర భారతిలో అవార్డులను ప్రధానం చేయనున్నారు. అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, విశిష్ట అతిథులుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నారు.

గతంలో పొన్నం సత్తయ్య మెమోరియల్ అవార్డు ప్రథమ సంవత్సరంలో రచయిత విభాగంలో నాళేశ్వరం శంకర్ , కళాకారుల విభాగంలో ఒగ్గు కథ ధర్మయ్యలు, ద్వితీయ సంవత్సరం రచయిత విభాగంలో నెలిమాల భాస్కర్ ,కళాకారుల విభాగంలో ప్రముఖ గాయని విమలక్క ఈ అవార్డులను అందుకున్నారు. ఇప్ప‌టికే చంద్ర‌బోస్ ఖాతాలో ప‌లు అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో అవార్డు చేర‌డంతో ఆయ‌న అభిమానులు విషెస్ తెలియ‌జేస్తున్నారు.