ఎవరు అవకాశమిస్తే వారినే చూడాలి: పూజా హెగ్డే
నా కొన్ని దక్షిణాది సినిమాలు సరిహద్దులు దాటి హిందీ ప్రేక్షకులను చేరుకున్నాయని తెలుసుకుని ఆశ్చర్యపోతున్నాను.
By: Tupaki Desk | 4 March 2025 5:00 AM IST''నేను బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగాను కాబట్టి హిందీ సినిమాలకు సంబంధించి నేను తీసుకునే నిర్ణయాలు చాలా భావోద్వేగంగా ఉంటాయి. నా కొన్ని దక్షిణాది సినిమాలు సరిహద్దులు దాటి హిందీ ప్రేక్షకులను చేరుకున్నాయని తెలుసుకుని ఆశ్చర్యపోతున్నాను. ఇప్పుడు నేను మరిన్ని హిందీ సినిమాలు చేసి సమతుల్యతను సాధించాలనుకుంటున్నాను'' అని అన్నారు పూజా హెగ్డే.
ఓవైపు తమిళం, తెలుగులో అగ్ర హీరోల సరసన వరుస అవకాశాలు అందుకున్న పూజా హెగ్డే కొంతకాలం పాటు బాలీవుడ్ కి దూరమైంది. అందువల్ల ఈ ఘట్టాన్ని ఎమోషనల్ గా తీసుకుంటోంది. సూర్యతో తదుపరి తమిళ చిత్రం రెట్రోలో కనిపించనుంది. భాషతో సంబంధం లేకుండా తమ దారికి వచ్చే ప్రాజెక్టులకు ఓపెన్గా ఉండటం ముఖ్యమని పూజా వ్యాఖ్యానించింది.
మనల్ని ఎవరు చూస్తున్నారో మనకు ఎప్పటికీ తెలియదు. మనలో ఏదో ఒక ప్రత్యేకతను ప్రజలు గమనిస్తారు..! భాష ఏదైనా సరే మంచి పాత్రలను పోషించడమే నా లక్ష్యం. ఎదిగే క్రమంలో చాలా సినిమాలు నాకు స్ఫూర్తినిచ్చాయి . అందుకే నేను కూడా శాశ్వత ప్రభావాన్ని చూపే సినిమాల్లో భాగం కావాలని కోరుకుంటున్నాను. అలాంటి కథల్ని పాత్రల్ని ఎంపిక చేసుకుంటున్నాను అని పూజా తెలిపింది. దేవా, మొహంజోదారో లాంటి చిత్రాల్లో నటించిన పూజా హెగ్డే `ముకుంద` చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది.
ఎవరు ఛాన్సిస్తే వారే ముఖ్యం:
అవకాశం ఇచ్చేది ఉత్తరాది లేదా దక్షిణాది అనే విభేధం తనకు లేదని పూజా హెగ్డే అన్నారు. పరిశ్రమ వ్యక్తి కానప్పుడు మనకు ఎవరు అవకాశాలిస్తారో వారే ముఖ్యం. నా కోసం సినిమాలు నిర్మించే వ్యక్తి లేకపోవడం.. ఒక సినిమా ఫ్లాపైనా నాకు నెక్ట్స్ సినిమా ఇస్తారని భరోసా ఇవ్వడం వల్ల ప్రతి సినిమా కీలకం అవుతుంది. తక్కువ అవకాశాలున్న సమయంలోనే, నేను నిరంతరం కష్టపడి నా కెరీర్ను నిర్మించుకున్నాను. ఇది ఒక ఉన్నత ప్రయాణం. ప్రతి సినిమా నాకు చాలా ముఖ్యమైనది. ప్రతి సినిమా తయారు చేయగలదు లేదా నాశనం చేయగలదు. మరో అవకాశం రావాలంటే ఇప్పుడు విజయం సాధించడం ముఖ్యం. అందుకే నేను నా పనిని ఎప్పుడూ తేలికగా తీసుకోను... అని పూజా తెలిపింది. తదుపరి హౌస్ ఫుల్ ఫ్రాంఛైజీలో ఈ భామ నటిస్తున్న సంగతి తెలిసిందే.