Begin typing your search above and press return to search.

ప్రభాస్ లేకుండానే పని మొదలెట్టేశారు

ప్రభాస్ ఈ చిత్రంలో బ్రిటిష్ ఆర్మీ సోల్జర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

By:  Tupaki Desk   |   19 Sep 2024 10:30 AM GMT
ప్రభాస్ లేకుండానే పని మొదలెట్టేశారు
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ చిత్రంలో బిజీగా ఉన్నప్పటికీ, మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న న్యూ ప్రాజెక్టు ఇటీవల అఫీషియల్ గా లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఈ కొత్త చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇకసినిమా బ్రిటిష్ ఇండియా ఆర్మీ సోల్జర్ కథతో 1945 కాలం నాటి నేపథ్యంతో ఉంటుందట.

ప్రభాస్ ఈ చిత్రంలో బ్రిటిష్ ఆర్మీ సోల్జర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథలో సెకండ్ వరల్డ్ వార్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు ఉంటాయని, అదే సమయంలో హను రాఘవపూడి తన స్టైల్‌లో ఒక బలమైన ఎమోషనల్ లవ్ స్టోరీని కూడా అందించబోతున్నారట. ప్రీ లుక్ పోస్టర్‌లోనే వార్ బ్యాక్‌డ్రాప్ కన్పించడంతో ఈ సినిమాలో యాక్షన్‌కు కొదవ ఉండదని చెప్పవచ్చు.

ఈ సినిమాలో ఇమాన్వి ఇస్మాయిల్ ప్రభాస్‌తో జోడీగా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది, అయితే ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్ పూర్తి చేసిన తరువాతే ఈ సినిమాకు జాయిన్ అవుతారని సమాచారం. మొన్న బుధవారం నుంచే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. మధురైలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

'రాజాసాబ్' షూటింగ్ పూర్తయిన తరువాతే ప్రభాస్ హను సినిమా సెట్లోకి చేరతారని సమాచారం. మధురై షెడ్యూల్‌లో ప్రభాస్ పై ఎలాంటి సన్నివేశాలు తీసుకోరని తెలుస్తోంది. వారం రోజుల పాటు ఈ షూటింగ్ అక్కడే జరుగుతుందని సమాచారం. ఇక ఈ షెడ్యూల్ అనంతరం హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేయనున్నారు. ప్రభాస్ టైమ్ కు తగ్గట్టుగా హను ఈ సినిమా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

సుబాస్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించిన ఆసక్తికర అంశాలను కూడా హను రాఘవపూడి ఈ చిత్రంలో చూపించనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, టీజర్‌లను త్వరలో విడుదల చేయనున్నారని ఫిల్మ్ యూనిట్ తెలిపింది. మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమా ప్రత్యేకంగా ఉండబోతోందని చెప్పాలి. ప్రముఖ సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తుండగా, ఇప్పటికే రెండు పాటలను రికార్డ్ చేసినట్లు సమాచారం. దసరాకు ఈ సినిమా నుంచి మరిన్ని అప్‌డేట్స్ రాబోతున్నాయి.