Begin typing your search above and press return to search.

రాజా సాబ్.. ప్రభాస్ లుక్ అదిరిపోయింది

ప్రభాస్ లుక్ అదిరిపోయిందని ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు. డార్లింగ్ స్వాగ్ లుక్ వేరే లెవెల్ లో ఉందని అంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టర్ ను ఓ రేంజ్ లో షేర్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   21 Oct 2024 11:47 AM GMT
రాజా సాబ్.. ప్రభాస్ లుక్ అదిరిపోయింది
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 2024లో ఇప్పటికే కల్కి 2898 ఏడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు రాజా సాబ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. స్టార్ డైరెక్టర్ మారుతి.. రాజా సాబ్ ను కామెడీ హారర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నారు మేకర్స్.

ఇప్పటికే పలు అప్డేట్స్ తో రాజా సాబ్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసిన మేకర్స్.. నేడు క్రేజీ అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ బర్త్ డే సందర్భంగా.. రెండు రోజుల ముందే ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు. "మేం మొదలుపెట్టిన క్రేజీ జర్నీలో మేం రూపొందించిన డార్లింగ్ పాత్రతో అక్టోబర్ 23న వస్తున్నారు" అంటూ ప్రభాస్ కొత్త పోస్టర్ ను రాజా సాబ్ మేకర్స్.. సోమవారం మధ్యాహ్నం నెట్టింట రిలీజ్ చేశారు.

అందులో ప్రభాస్ స్టైలిష్ అండ్ ట్రెండీ లుక్ లో అదరగొట్టారు. క్యాజువల్ ప్యాంట్, చెక్ షర్ట్ తో ఉన్న డార్లింగ్ స్వాగ్ లుక్.. సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. గ్లాసెస్ పెట్టుకుని యమా స్టైలిష్ లుక్ లో నడుస్తూ కనిపించారు. ప్రస్తుతం ఆయన పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదే సమయంలో అక్టోబర్ 23న రాయల్ ట్రీట్ ఇవ్వనున్నారు మేకర్స్. టీజర్‌ లేదా టైటిల్ ట్రాక్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ లుక్ అదిరిపోయిందని ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు. డార్లింగ్ స్వాగ్ లుక్ వేరే లెవెల్ లో ఉందని అంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టర్ ను ఓ రేంజ్ లో షేర్ చేస్తున్నారు. తమ అభిమాన హీరో బర్త్ డే ఫెస్టివల్.. రెండు రోజుల ముందే వచ్చేసిందని చెబుతున్నారు. పోస్టర్ ఇంత బాగుంటే.. ఇంకా రాయల్ ట్రీట్ ఇంకెంత బాగుంటుందోనని అంటున్నారు. వెయిటింగ్ ఆఫ్ రాయల్ ట్రీట్ అని చెబుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాణీలు కడుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 2025 ఏప్రిల్ 10వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి రాజా సాబ్ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.