Begin typing your search above and press return to search.

'రాజాసాబ్‌' కి గుమ్మడి కాయ కొట్టేది అప్పుడేనా..!

ఇప్పటికే రాజాసాబ్‌ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.

By:  Tupaki Desk   |   4 Oct 2024 12:30 PM GMT
రాజాసాబ్‌ కి గుమ్మడి కాయ కొట్టేది అప్పుడేనా..!
X

సలార్‌, కల్కి 2898 ఏడీ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'రాజా సాబ్‌' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. వీరి కాంబో మూవీ ప్రారంభం అయి చాలా కాలం అయింది. కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్‌ చాలా ఆలస్యం అవుతూ వస్తుంది. దర్శకుడు మారుతి చాలా ఓపికగా ప్రభాస్ డేట్లు ఇచ్చినప్పుడు సినిమా షూటింగ్‌ చేస్తూ వచ్చారు. తాజా సమాచారం ప్రకారం సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. కల్కి సినిమా విడుదల తర్వాత రాజాసాబ్‌ సినిమాకు ప్రభాస్ రెగ్యులర్‌ డేట్లు ఇస్తూ వస్తున్నారు. దాంతో ఈ మధ్య షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది.

ఇప్పటికే రాజాసాబ్‌ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. కనుక ఈ ఏడాదిలోనే షూటింగ్ ను పూర్తి చేయాలని దర్శకుడు మారుతి భావిస్తున్నారు. ప్రభాస్ సైతం వరుసగా ఫౌజీ, సలార్ 2, కల్కి 2 సినిమాలు చేయాల్సి ఉంది. కనుక రాజా సాబ్ సినిమా షూటింగ్‌ను నవంబర్‌ లోనే పూర్తి చేయాలని భావిస్తున్నారు. రాజాసాబ్ సినిమా హర్రర్‌ నేపథ్యంలో రూపొందుతున్న భారీ సినిమా. ఈ సినిమా కోసం దాదాపు మూడు నాలుగు నెలల పాటు వీఎఫ్ఎక్స్ వర్క్ కి పట్టే అవకాశం ఉందట. కనుక ముందుగానే షూటింగ్‌ పూర్తి చేసి పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ జరపాలని భావిస్తున్నారు.

'రాజా సాబ్‌' సినిమా షూటింగ్‌ ప్రస్తుతానికి స్పీడ్ గా జరుగుతోంది. ఇదే స్పీడ్ తో జరిగితే నవంబర్‌ నెలలో పూర్తి చేసి గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయి. గత నెల రోజులుగా కంటిన్యూ డేట్లను రాజా సాబ్ సినిమా కోసం ప్రభాస్ ఇవ్వడం జరిగింది. కనుక రాజా సాబ్‌ సినిమా షూటింగ్‌ అనుకున్న సమయం కంటే కాస్త ముందుగానే పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రభాస్‌ తో పాటు ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండగా, దసరా సందర్భంగా స్పెషల్ వీడియో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది.

ప్రభాస్ రాజాసాబ్‌ సినిమాలో చాలా వైవిధ్యభరిత పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన్ను చూడని విధంగా చూస్తామని అంటున్నారు. లుంగీ లో ఇప్పటికే ప్రభాస్ ను చూసి చాలా మంది సర్‌ప్రైజ్ అయ్యారు. రాజా సాబ్‌ ని మొదట చిన్న సినిమాగా అనుకున్నప్పటికి దాదాపుగా రూ.300 కోట్లబడ్జెట్‌ అయిందని సమాచారం అందుతోంది. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌ తో పాటు మరో హీరోయిన్ ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా కనిపించబోతుంది. సినిమా లో మెజార్టీ పార్ట్‌ షూట్‌ ఒక థియేటర్ లో ఉంటుందట. అందుకు సంబంధించిన షూటింగ్‌ మొత్తం పూర్తి చేస్తే సినిమా కి గుమ్మడి కాయ కొట్టడమే అని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.