Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీ కిడ్స్ ని బుజ్జి అలా బుట్ట‌లో!

ఇప్ప‌టికే గ్రాండ్ గా బుజ్జి ప‌రిచ‌యం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   3 Jun 2024 2:30 PM GMT
ఇండ‌స్ట్రీ కిడ్స్ ని బుజ్జి అలా బుట్ట‌లో!
X

ప్ర‌చారంలో ఎవ‌రి స్ట్రాట‌జీ వారిది. ఎవ‌రి ఎలాంటి స్ట్రాట‌జీతో ముందుకెళ్లినా అంతిమంగా సినిమా అనేది జ‌నాల్లోకి వెళ్ల‌డం ముఖ్యం. అందుకోసం ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు రిలీజ్ వ‌ర‌కూ అంతే క‌ష్ట‌ప‌డుతుంటారు. తాజాగా యువ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కూడా రాజ‌మౌళి త‌ర‌హా స్ట్రాట‌జీతోనే 'క‌ల్కి 2898'ని మార్కెట్ లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టికే గ్రాండ్ గా బుజ్జి ప‌రిచ‌యం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం బుజ్జి అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లోనూ హ‌ల్చ‌ల్ చేస్తోంది.


బుజ్జి ఏ న‌గ‌రానికి వెళ్తే అక్క‌డ క‌ల్కి గురించే చ‌ర్చ న‌డుస్తోంది. తాజాగా క‌ల్కి యూనిట్ ఇండ‌స్ట్రీ కిడ్స్ ని సైతం వ‌ద‌ల‌డం తెలుస్తోంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా కల్కి టీమ్ సినీ సెలబ్రిటీల పిల్లలకు గిఫ్ట్ లు పంపుతోంది. ఇండ‌స్ట్రీలో ఉన్న స్టార్ హీరోల పిల్ల‌లంద్ద‌ర్నీ లిస్ట్ ఔట్ చేసి వాళ్ల ఇంట‌లికి గిప్ట్ ల‌రూపంలో ప్ర‌చారం చేరుతుంది.

తాజాగా రామ్‌ చరణ్‌- ఉపాసనల కుమార్తె క్లీంకార కొణిదెలకు కల్కి మూవీ యూనిట్‌ ఓ బహుమతి అందించింది. అందులో బుజ్జి , భైరవ స్టిక్కర్స్‌, బుజ్జి బొమ్మ, టీషర్ట్స్‌ ఉన్నాయి.

ఈ సందర్భంగా క్లీంకార వాటితో ఆడుకుంటున్న ఫొటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసారు. 'కల్కి టీమ్‌కు థ్యాంక్స్‌, ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పారు మెగా కోడలు. క్లీంకార‌కి క‌ల్కి గిప్ట్ అందిందంటే? ఆసినిమాకి కోట్ల రూపాయ‌ల ప‌బ్లిసిటీ ఉచితంగా వ‌చ్చిన‌ట్లే క‌దా. సినిమా రిలీజ్ అయ్యే లోపు ఇలాంటి గిప్ట్ లు ఇంకా చాలా మంది పిల్ల‌ల‌కు చేరే అవ‌కాశం ఉంది. వారంతా కూడా త‌ప్ప‌కుండా సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ వేస్తారు. త‌ద్వారా సినిమాకి మ‌రింత ప్ర‌చారం ద‌క్కిన‌ట్లే. ఈ చిత్రాన్ని జూన్ 27న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే.

రేపే ఏపీ, తెలంగాణ‌లో ఎన్నిక‌ల ఫ‌లితాలు తేలనున్నాయి. ఆ త‌ర్వాత వాతావ‌ర‌ణ‌మంతా చ‌ల్ల‌బ‌డుతుంది. ఎన్నిక‌ల కోడ్ కూడా ముగుస్తుంది. దీంతో సినిమాకి సంబంధించి ఈవెంట్లు కూడా ఎంచ‌క్కా నిర్వ‌హించుకోవ‌చ్చు. క‌ల్కి పాన్ ఇండియాలో ప్ర‌చారం ముగించిన త‌ర్వాత తెలంగాణ‌, ఏపీలో పెద్ద ఈవెంట్లు చేసే అవ‌కాశం ఉందంటున్నారు. కానీ దీనిపై చిత్ర వ‌ర్గాల నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.