Begin typing your search above and press return to search.

ఇదే నెలలో మదురైకి ప్రభాస్‌.. కారణం ఇదే!

మూడు వారాల షెడ్యూల్‌ ల్లో భాగంగా ప్రభాస్ ఆగస్టు 22న మధురై కి వెళ్లనున్నారు.

By:  Tupaki Desk   |   10 Aug 2024 10:48 AM GMT
ఇదే నెలలో మదురైకి ప్రభాస్‌.. కారణం ఇదే!
X

ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్‌ సినిమాతో పాటు సలార్ మరియు కల్కి 2, స్పిరిట్‌ సినిమాలకు కమిట్‌ అయ్యి వాటిని పూర్తి చేసేందుకు బిజీ బిజీగా ఉన్నాడు. గతంలో ఒకే సారి రెండు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించని ప్రభాస్ ఇప్పుడు ఏకంగా మూడు నాలుగు సినిమాలు ఒకేసారి చేస్తున్నాడు. రాజా సాబ్‌ సినిమా షూటింగ్‌ మరి కొన్ని నెలల్లో పూర్తి అవ్వబోతుంది. సలార్‌ 2 ను మొదలు పెట్టారు, కల్కి 2 ని కూడా త్వరలో పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెల్సిందే.

యుద్దం నేపథ్యంలో సాగే చక్కని ప్రేమ కథ తో ప్రభాస్‌, హను రాఘవపూడి కాంబో మూవీ ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సుభాష్ చంద్రబోస్ కథ మరియు కాన్సెప్ట్‌ తో ఈ సినిమా ఉంటుందని, అందుకోసం ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ కు గ్రీన్ సిగ్నల్‌ లభించింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది, పూర్తి స్థాయి స్క్రిప్ట్‌ కి కూడా ప్రభాస్‌ ఓకే చెప్పడంతో పాటు, డేట్లు కూడా ఇవ్వడం జరిగిందని వార్తలు వస్తున్నాయి.

సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్‌, హను రాఘవపూడి కాంబోలో రూపొందబోతున్న సినిమా పూజా కార్యక్రమాలను ఆగస్టు 17 న హైదరాబాద్‌ లోని ప్రముఖ స్టూడియోలో నిర్వహించబోతున్నారు. సినీ ప్రముఖులు పలువురు ఆ కార్యక్రమానికి హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత రోజు అంటే ఆగస్టు 18 నుంచి మూడు వారాల పాటు మధురై లో షూటింగ్ జరుపుతున్నారు. మూడు వారాలకు సంబంధించిన షెడ్యూల్‌ ను కూడా ప్లాన్‌ చేశారు.

మూడు వారాల షెడ్యూల్‌ ల్లో భాగంగా ప్రభాస్ ఆగస్టు 22న మధురై కి వెళ్లనున్నారు. ప్రభాస్ 15 రోజుల పాటు షూటింగ్‌ లో పాల్గొంటాడు అంటూ సమాచారం అందుతోంది. మొత్తానికి ప్రభాస్ ఇప్పటికే చేతిలో చాలా సినిమాలు ఉండగా అప్పుడే కొత్త సినిమాకు కమిట్‌ అవ్వడం, డేట్లు కూడా ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్స్ మరియు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్‌ గా నటించబోతుందనే ప్రచారం కూడా జరుగుతోంది.